Sunday, 20 June 2021

మంచి మనసు చాటుకున్న నిర్మాత.. దిల్ రాజు వ్యాక్సినేషన్ ప్రోగ్రాం

ప్రస్తుతం కరోనాను ఎదుర్కొనేందుకు అందరికీ ఒక్కటే ఆయుధం ముందుంది. అదే వ్యాక్సినేషన్. కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలంటూ ప్రభుత్వాలు అందరికీ సూచిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్‌లను చేపట్టి ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. ఇక కొంత మంది ప్రైవేట్ సంస్థలు తమ సిబ్బంధికి వ్యాక్సిన్‌ను వేయిస్తున్నారు. అయితే ఈ క్రమంలో కూడా తమ సిబ్బంధి, తన చిత్రాలకు పని చేస్తున్న వారికి అందరికీ వ్యాక్సిన్ వేయించారు. తన కార్యాలయంలోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దిల్ రాజు ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టేశారు. ఇప్పటికే కొన్ని ప్రాజెక్ట్‌లు షూటింగ్‌లను పూర్తి చేసుకున్నాయి. ఇంకొన్ని సెట్స్ మీదున్నాయి. మరికొన్ని సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్దంగా ఉన్నాయి. ఇందులో ముందుగా దళపతి విజయ్ వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్, శంకర్ రామ్ చరణ్ కాంబోలో రాబోతోన్న సినిమాలపై దిల్ రాజు ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దిల్ రాజు మాత్రం తన దగ్గర పని చేస్తున్న స్టాఫ్‌కు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేయించి మంచి మనసును చాటుకున్నారు. దాదాపు 200 మందికి తన కార్యాలయంలోనే ప్రత్యేకంగా వ్యాక్సిన్ వేయించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ ట్వీట్ వేసింది. మా సినిమాలకు పని చేస్తున్న దాదాపు 200 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించామని పేర్కొంది. ఈ పనితో దిల్ రాజుకు సోషల్ మీడియాలో మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cY8l3H

No comments:

Post a Comment

'Wish I Was Given Other Roles In Addition To Mothers'

'Each mother I have played is different, but the writing dictates the doing of it. If it's written well, that's half the work do...