Sunday, 1 November 2020

RRR రచ్చ: సినిమా రీళ్లు తగలబెట్టి మీ ఆస్తులు ధ్వంసం చేస్తాం.. రాజమౌళికి బండి సంజయ్ వార్నింగ్

వివాదాలకు దూరంగా ఉంటూ భారీ సినిమాలు రూపొందించే దర్శకధీరుడు రాజమౌళిని ఇప్పుడు వివాదం వెంటాడుతుండటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఎన్టీఆర్ టీజర్ విడుదల చేయడంతో అందులోని సన్నివేశాలపై ఓ వర్గం నుంచి వ్యతిరేకత మొదలైంది. దీంతో షూటింగ్ దశలోనే RRR సినిమాపై వివాదాలు చుట్టముట్టడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రోజురోజుకూ రచ్చ ముదురుతుండటంతో దీనిపై స్పందించాల్సిన అవసరం ఉందనే టాక్ నడుస్తోంది. చాలా కాలం ఎదురుచూపుల అనంతరం RRR నుంచి ఇటీవల విడుదలైన 'రామరాజు ఫర్‌ భీమ్'‌ టీజర్‌‌కు ఊహించని రీతిలో రెస్పాన్స్‌ రావడమే గాక పలు వివాదాలు చుట్టుముట్టాయి. కొమురం భీమ్‌ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్.. టీజర్ చివరలో పోషించిన ముస్లిం టోపీని పెట్టుకుని కనిపించడం ఈ వివాదాలకు బీజం వేసింది. గిరిజన పుత్రుడైన కొమురం భీమ్‌కి టోపీ పెట్టడమేంటని ఇప్పటికే కొందరు బీజేపీ నాయకులు జక్కన్నకు వార్నింగ్‌ ఇవ్వగా.. తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ మరింత ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఈ ఇష్యూ రచ్చ రచ్చ అవుతోంది. Also Read: కొమరం భీమ్‌కు టోపి పెట్టడం ఏంటి రాజమౌళి.. దుమ్ముంటే నీజాం రజాకార్లకు బొట్టు పెట్టి సినిమా తియ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు . RRR విడుదలకు అడ్డుకుంటామని, సినిమా రీళ్లను తగలబెడుతామని అన్నారు. అంతటితో ఆగక.. సినిమా విడుదల చేస్తే మీ ఆస్తులను ధ్వంసం చేస్తారు జాగ్రత్త అని హెచ్చరించారు. హిందూమతాన్ని అవమానపరిస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ ఫైర్ అయ్యారు. కాగా ఈ వివాదం ఇంత ముదురుతున్నా రాజమౌళి స్పందించకపోవడం మెగా, నందమూరి అభిమానులను కలవరపెడుతోంది. అభ్యంతరాలు చెబుతూ ధ్వజమెత్తుతున్న ప్రతి ఒక్కరికీ ధీటైన సమాధానం ఇవ్వాలని వారు భావిస్తున్నారు. చూడాలి మరి రాజమౌళి ఈ ఇష్యూని ఎలా హ్యాండిల్ చేస్తారనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3efvHBh

No comments:

Post a Comment

'After Aradhana, People Took Me Seriously'

'Everybody was scared, especially with Rajesh Khanna playing a double role and playing my lover and my son.' from rediff Top Inter...