Sunday 15 November 2020

తెలుసు.. ఆమె వెళ్ళిపోతుందని తెలిసి గుండె రాయి చేసుకున్నా.. కంటతడి పెట్టుకున్న రాజీవ్ కనకాల

ఎంతో ఆనందంగా ఉండే ఇంటిని వరుస విషాదాలు వెంటాడిన సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాల వరుసగా తన తండ్రి దేవదాస్‌ కనకాల, తల్లి లక్ష్మీదేవి కనకాల ఆ తర్వాత చెల్లెలు శ్రీ లక్ష్మిని కోల్పోయారు. రాజీవ్ ఇంట వెల్లువెత్తిన విషాదాలు ఏ ఒక్క తెలుగు సినిమా ప్రేక్షకుడు మరిచిపోలేడు. అయితే ఆ సమయంలో రాజీవ్ కనకాల ఎంత ఆవేదన చెందారు? కుటుంబం ఎంత కలతచెందింది? అనే విషయాలను ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు. రాజీవ్ కనకాల మాట్లాడుతూ.. ''కుటుంబంలో ఒకేసారి ముగ్గురిని కోల్పోవడం చాలా బాధ అనిపించింది. ఆ టైమ్‌లో చాలా ఇబ్బంది పడ్డాం. లైఫ్ అన్నాక తప్పదని ధైర్యం తెచ్చుకుంటున్నాం. పిల్లలున్నారు.. మేమే అధైర్యపడితే వారి ఫ్యూచర్ కష్టం అని భావించి బలవంతంగా ఆ ఆలోచనల నుంచి బయటకు రావాలని చాలా ట్రై చేస్తుంటాం. కానీ వస్తూనే ఉంటాయి. రక్త సంబంధం కోల్పోయాక ఓ మూడు నెలలైతే పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నాను. ముఖ్యంగా నా కంటే చిన్నదైన చెల్లెలిని కోల్పోయినప్పుడు చాలా బాధేసింది. చెల్లెలికి క్యాన్సర్ సోకాక తను మెల్లగా అనారోగ్యం నుంచి కోలుకుంటూ అంతా సేఫ్ అనుకుంటున్న సమయంలో పిడుగు లాంటి వార్త వినాల్సి వచ్చింది. నేను మధురైలో షూటింగ్‌లో ఉండగా.. మా బావ ఫోన్ చేసి పాపాయ్‌కి బాగాలేదని చెప్పారు. వెంటనే ఇంటికి చేరుకున్నా. నా చెల్లి బ్రతికే ఛాన్సెస్ లేవని తెలిసి తీవ్రంగా బాధపడ్డాను. ఆ తర్వాత రెండు రోజుల్లో శ్రీ లక్ష్మి మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది. మా చెల్లెలు ఇన్సిడెంట్ తర్వాత మనసు రాయి చేసుకున్నా. Also Read: మా మేనకోడళ్ళిద్దరూ చాలా ధైర్యవంతులు. ఆ పిల్లలను మా ఇంటికి తీసుకొద్దామని అనుకున్నాం. కానీ వాళ్లకు తమ సొంతింటితో ఉన్న అనుబంధం కారణంగా వాళ్ళు రానని చెప్పి నాన్న దగ్గరే ఉన్నారు. అప్పుడప్పుడూ మేమే వెళ్లి వస్తుంటాం. సుమతో నా చెల్లి పిల్లలు చాలా క్లోజ్, అత్తతో చాలా స్నేహంగా ఉంటారు'' అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు రాజీవ్ కనకాల. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3nknOh4

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...