Wednesday, 25 March 2020

ఇటలీలో చిక్కుకున్న ప్రముఖ తెలుగు సింగర్

ఇటలీలో ప్రస్తుతం కరోనా వైరస్ మరణ మృదంగం సృష్టిస్తోంది. చైనాలో ఈ భయంకర వైరస్ పుట్టినప్పుటికీ... ఇటలీలో మాత్రం అత్యధిక ప్రాణ నష్టం సంభవించింది. రోజు వందల సంఖ్యలో ప్రజలు మరణిస్తుంటే, వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అందరికీ వైధ్య సేవలు అందించే పరిస్థితి కూడా లేకపోవటంతో ప్రాణాలు పోతున్న ప్రభుత్వం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది. అయితే ఇలాంటి భయంకర పరిస్థితిల నేపథ్యంలో ఇటలీలోని ఓ టాలీవుడ్‌ గాయని ఇరుక్కుపోయింది. ఎన్నో తెలుగు సినిమాల్లో పాటలు పాడిన ప్రముఖ యంగ్ సంగర్ ... ప్రస్తుతం ఇటలీలో ఉన్నట్లు తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఇటలీలో భయంకర పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఎప్పుడు ఎవరు ఆస్పత్రి వెళ్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉందని పేర్కొంది. కరోనా వైరస్ తమకు సోకిందని తెలిసినప్పటికే చాలామంది చనిపోతున్నారంది. ఇప్పటికే ఇటీలిలో ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయని తెలిపింది శ్వేతా. ఉదయం లేవగానే తాను ముందుగా వినేది అంబులెన్స్ సౌండే అని తెలిపింది. ప్రస్తుతానికి తాను ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపింది. ఇటలీ లాంటి భయంకర పరిస్థితి మన దేశానికి రాకూడదంది. భారత్‌లో లాక్ డౌన్ నడుస్తున్నట్లు తనకు తెలిసిందంది. తనకు భారత్‌కు రావాలని ఉన్నా... ప్రస్తుతమున్న పరిస్థితుల్లో తాను ఇండియాకు రావడం సరికాదంది. అందుకే తాను ఇటలీలోనే ఉండిపోయాయని తెలిపింది. తన ద్వారా తనకు తెలియకుండా వైరస్ ఎక్కడ భారత్‌కు వస్తుందన్న భయంతోనే... రావడం లేదని తెలిపింది శ్వేతా పండింట్. భారతీయులంతా క్షేమంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మహానుభావుడు, ఓం నమో వేంకటేశాయ లాంటి తెలుగు సినిమాల్లో సూపర్‌ హిట్ సాంగ్స్‌ పాడింది శ్వేత పండిట్. తెలుగుతో పాటు హిందీలోనూ పలు పాటలు ఆలపించిన శ్వేతా ప్రస్తుతం ఇటలీలో చిక్కుకుంది. దీంతో ఆమె కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె అక్కడ క్షేమంగా ఉండాలని కోరుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3duV1T6

No comments:

Post a Comment

'Dhurandhar 2 Will Make 2,000 Crores'

Ramgopal Varma: 'Even if they think it's a horrible film, it'll do 2,000 crores'. from rediff Top Interviews https://ift.t...