Tuesday, 31 March 2020

కరోనాపై పాట పాడిన వర్మ.. ఇవాళ సాయంత్రం రిలీజ్

వివాదాస్పద దర్శకుడు మరోసారి పాట పాడేందుకు సిద్ధమవుతున్నాడు. ఎప్పటికప్పుడ జరిగే పరిణామలపై వర్మ స్పందిస్తూ ఉంటాడు. తాజాగా పై కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన అనుభవాల్ని పంచుకుంటున్నాడు. అయితే తాజాగా కరోనాపై కూడా పాట విడుదల చేస్తానని ప్రకటించాడు వర్మ. ఈ వైరస్ పై సొంతంగా పాట పాడానని ట్విట్టర్లో తెలిపాడు. ఆ పాటను బుధవారం సాయంత్రం 5:30లకు విడుదల చేస్తాననన్నాడు. ఇది కరోనా వైరస్ పైన నేనే రాసి,పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమో...చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి. మొత్తం పాట రేపు సాయంత్రం 5.30 కి స్ప్రే చేయబోతున్నాను. అని మంగళవారం వర్మ ట్వీట్ చేశారు. ‘ కనిపించని పురుగు.. కరోనా అనే ఒక పురుగు. నలిపేద్దామంటే అంత సైజ్ లేదు దానికి... పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి. అదే దాని బలం. అదే దాని దమ్ము. ఉనికిని చూపిస్తే కింద బాంబు పెట్టి పేల్చోచ్చు. but it is just పురుగు అంటూ వర్మ పాట పాడి పోస్టుచేశారు. మొత్తం పాట ఇవాళ సాయత్రం 5:30లకు విడుదల చేస్తానన్నారు. కరోనా వైరస్‌ కారణంగా యావత్ ప్రపంచం అతలాకుతలం అవుతుంటే... వర్మ మాత్రం దీనిపై ఎప్పటికప్పుడు తనదైన స్టయిల్లో కామెంట్స్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకరిస్తున్నాడు. గతంలో కూడా ‘ అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా కోసం వర్మ పాట పాడారు. ఆ పాటను కూడా అయినా ఇలానే నెటిజన్ల కోసం ముందుగా సోషల్ మీడియాలోనే పోస్టు చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2wGXyJj

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...