Saturday, 28 March 2020

మిత్రమా.. మార్పు రావాలి: మోహన్ బాబుకు చిరు మరో పంచ్

చిరంజీవికి చమత్కారం బాగా ఎక్కువైందని ఈ మధ్య వినిపిస్తోన్న మాట. నిజానికి ఈ మధ్య కాలంలో ఆయన హాజరైన వేడుకలు, కార్యక్రమాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. ఇక రాజకీయాలకు టాటా చెప్పి తన పూర్తి సమయాన్ని సినిమాలకే కేటాయించారు. ఇండస్ట్రీకి పెద్దన్న పాత్రను పోషిస్తూ చిన్న సినిమాలను ప్రోత్సహిస్తున్నారు. వాటికి ప్రచారం కల్పిస్తున్నారు. అలాగే, స్టార్ హీరోలు నటించిన సినిమాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ వేడుకల్లో మాట్లాడుతూ తన చమత్కారంతో ప్రేక్షకులకు బోలెడంత ఎంటర్‌టైన్మెంట్‌ను పంచుతున్నారు. కేవలం ఇలాంటి వేడుకల్లో అందించే ఎంటర్‌టైన్మెంట్ సరిపోదని ఇప్పుడు ట్విట్టర్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. చిరంజీవి ఉగాది నాడు (మార్చి 25న) సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచిన విషయం తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆయన అభిమానులు, ప్రేక్షకులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటున్నారు. అయితే, ట్విట్టర్‌లో కూడా తన చమత్కారంతో అభిమానులను కట్టిపడేస్తున్నారు చిరంజీవి. ముఖ్యంగా తన మిత్రుడు, సహ నటుడు మంచు మోహన్ బాబుతో ఆయన చేస్తోన్న కామెడీ బాగా హైలైట్ అవుతోంది. Also Read: ట్విట్టర్‌లో చేరిన చిరంజీవికి ట్విట్టర్‌లోకి స్వాగతం పలుకుతూ మోహన్ బాబు 26వ తేదీన ట్వీట్ చేశారు. ‘‘మిత్రమా వెల్‌కమ్’’ అని చిరంజీవిని ట్యాగ్ చేసి మోహన్ బాబు సింపుల్ ట్వీట్ చేశారు. దీనికి చిరంజీవి అదిరిపోయే రిప్లై ఇచ్చారు. ‘‘థాంక్యూ మిత్రమా మోహన్ బాబు. రాననుకున్నావా.. రాలేననుకున్నావా?’’ అంటూ ‘ఇంద్ర’ సినిమా డైలాగుతో చిరంజీవి పంచ్ వేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు స్పందిస్తూ.. ‘‘ఈసారి హగ్ చేసుకున్నప్పుడు చెపుతాను’’ అని పేర్కొన్నారు. మోహన్ బాబు ట్వీట్‌కు ఇప్పుడు మరోసారి పంచ్ వేశారు చిరంజీవి. ‘‘మిత్రమా.. కరోనా రక్కసి కోరలు చాస్తున్న ఈ తరుణంలో మనలో మార్పు రావాలి. కౌగిలింతలు వద్దు. కరచాలనాలు వద్దు. నమస్తే మాత్రమే పెడదాం! సామాజిక దూరం తప్పక పాటించాలి. మనవాళ్లని ఎలా రక్షించుకోవాలి అనే విషయంలో మరింత అవేర్‌నెస్ కోసం మన లక్ష్మీ ప్రసన్న చేసిన వీడియో చూడు’’ అని మోహన్ బాబుకు చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు మోహన్ బాబు మరింత తెలివిగా స్పందించారు. ‘‘మిత్రమా, మహమ్మారి తాత్కాలికం. మన స్నేహం శాశ్వతం’’ అని రిప్లై ఇచ్చారు. మొత్తం మీద వీరిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా సాగుతోన్న సంభాషణ అందరికీ మంచి ఎంటర్‌టైన్మెంట్‌ను ఇస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39oOBl7

No comments:

Post a Comment

'Not The Time To Pull Out Of Equities'

'Investors should review their portfolios, prioritise flexi-cap mutual funds, and stick to the basics.' from rediff Top Interviews...