Monday, 30 March 2020

Chiranjeevi: శ్రీరామనవమికి చిరు ట్రీట్.. ట్విట్టర్ హీటెక్కడం ఖాయమే బాసూ!

మెగాస్టార్ చిరంజీవి శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకులకు ఏప్రిల్ 2న అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారంటే అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. కొరటాల దర్శకత్వంలో చిరు 152 మూవీకి సంబంధించిన ‘ఆచార్య’ టైటిల్‌‌ను మెగాస్టార్ ‘పిట్టకథ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రివీల్ చేసేశారు. ఇక శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న ఈ మూవీ టైటిల్ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే మెగా ట్వీట్స్‌తో ట్విట్టర్ హీటెక్కిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. మెగాస్టార్ ట్విట్టర్‌లో ఎంట్రీ ఇచ్చిన తరువాత నిరంతరం ఇండస్ట్రీతో టచ్‌లో ఉంటూ అప్డేట్స్ అందిస్తున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో కీలకమైన సూచనలు చూస్తూ.. కష్టల్లో ఉన్న ఇండస్ట్రీని ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)ని ఏర్పాటు చేసి విరాళాలను సేకరిస్తున్నారు. ఈ వివరాలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ మరి కొంతమంది స్టార్లలో సాయం చేయలనే ప్రేరణ కలిగిస్తున్నారు. ఇక వీటితో పాటు హీరోలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడం.. మోహన్ బాబు లాంటి మిత్రులతో సరదాగా సంభాషిస్తూ ట్విట్టర్‌లోనూ మెగాస్టార్ సత్తా చూపిస్తున్నారు. కాగా గురువారం నాడు ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ లేదా ఏదో ఒక అప్డేట్ మాత్రం పక్కాగానే కనిపిస్తుండటంతో ‘ఆచార్య’ కోసం ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఇక ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రెజీనా స్పెషల్ సాంగ్‌లో నటిస్తోంది. ఈ సాంగ్‌కి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అయ్యింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, రామ్ చరణ్ నటిస్తున్నారనే వార్తలపై క్లారిటీ రావాల్సి ఉంది. శ్రీరామనవమి నాడు విడుదలయ్యే ఫస్ట్‌లుక్‌తో అయినా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QX2XCC

No comments:

Post a Comment

'When Children See I Am Alive, They Hug Me'

'At the airport, some people held me like a mother holds her child's cheeks. I have never experienced these kinds of things.' ...