నేడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు 24వ వర్ధంతి. కావడంతో.. హైదరాబాద్లోని ఘాట్లో వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు దంపతులు పుష్పగుఛ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. కొద్దిసేపు ఘాట్లోనే కూర్చొన్నారు. ఇటు ఎన్టీఆర్కు నివాళులు అర్పించేందుకు అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. తమ అభిమాన నటుడిని గుర్తు చేసుకుని నివాళులు అర్పిస్తున్నారు. ఇటు ఆయన వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు రక్తదాన, ఉచిత వైద్య శిబిరాలు, సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా హైదరాబాద్లో ర్యాలీ ఏర్పాటు చేశారు. సనత్నగర్ నియోజకవర్గంలోని రసూల్పూర చౌరస్తా ఎన్టీఆర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు అమరజ్యోతి ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హాజరవుతారని తెలుస్తోంది. టీడీపీ కార్యకర్తలు భారీగా తరలిరావాలని పార్టీ పిలుపునిచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2tlGYNs
No comments:
Post a Comment