Saturday, 25 January 2020

`మహా సముద్రం`లోకి యంగ్ హీరో.. ఈ సారైనా పట్టాలెక్కుతుందా!

సినీ ఇండస్ట్రీ సక్సెస్‌ వెంటే పరిగెడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఏ దర్శకుడికైనా ఒక్క హిట్ వస్తే చాలా వెంటనే హీరోలు నిర్మాతలు క్యూ కట్టేస్తారు. కానీ అన్ని సందర్భాల్లో ఇలా జరగదు. ఓ బ్లాక్‌ బస్టర్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఓ డైరెక్టర్‌ రెండో సినిమాను ప్రారంభించడానికి పెద్ద యజ్ఞమే చేస్తున్నాడు. రా బోల్డ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఘన విజయం సాధించిన సినిమా ఆర్‌ఎక్స్‌ 100. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు . రామ్‌ గోపాల్‌ వర్మ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన అజయ్‌ తొలి సినిమాతోనే తన మార్క్‌ చూపించాడు. ఆర్‌ఎక్స్‌ 100 సూపర్‌ హిట్ కావటంతో ఒక్కసారిగా టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయాడు అజయ్‌. Also Read: అదే జోరులో రెండో సినిమాకు రెడీ అయ్యాడు. ఇద్దరు యంగ్ హీరోలతో ఓ మల్టీ స్టారర్‌ సినిమాను ప్లాన్ చేశాడు. కానీ కథ వర్క్‌ అవుట్ కాలేదో లేక హీరోల డేట్స్‌ అడ్జస్ట్ కాలేదో తెలియదుగానీ ఇంత వరకు అజయ్‌ రెండో సినిమా పట్టాలెక్కలేదు. అనే టైటిల్‌ను చాలా కాలం కిందటే ఎనౌన్స్‌ చేసినా ఆ సముద్రాన్ని దాటే కథానాయకుడు మాత్రం ఇంత వరకు సెట్ కాలేదు. ముందుగా ఈ కథను ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ చెప్పాడన్న టాక్‌ వినిపించింది. మరో హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తాడన్న ప్రచారం కూడా జరిగింది. తరువాత సీన్‌లో రవితేజ పేరు వచ్చింది. ఆ తరువాత హీరోలు ఎవరు అంగీకరించకపోవటంతో తానే ఒక హీరోగా నటించేందుకు అజయ్‌ రెడీ అవుతున్నాడన్న టాక్‌ వినిపించింది. ఫైనల్‌గా నాగచైతన్య ఈ సినిమాకు ఓకె చెప్పాడన్న వార్త వినిపించింది. Also Read: తాజాగా నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట. దీంతో మరో యంగ్ హీరో శర్వానంద్‌కు కథ వినిపించిన అజయ్‌ భూపతి, త్వరలోనే సినిమాను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం తమిళ సూపర్‌ హిట్ 96కు రీమేక్‌గా తెరకెక్కుతున్న జాను సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్‌ తరువాత మహా సముద్రం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశం ఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/37qHLLO

No comments:

Post a Comment

'Nowhere In Empuraan Did They Mention Godhra'

'They just showed riots created by some political party. They never mentioned the name of the place or the political party.' from ...