Tuesday, 28 January 2020

ముళ్లు గుచ్చుకున్నాయంతే.. కంగారేమీలేదు: రజినీకాంత్

సూపర్‌స్టార్ ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ అనే అడ్వెంచరస్ షూట్‌లో పాల్గొన్నారు. కర్ణాటకలోని బందిపూర్ అడవిలో ప్రముఖ బ్రిటిష్ అడ్వెంచరర్ బేర్ గ్రిల్స్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్నారు. అయితే షో షూట్ చేస్తుండగా రజినీకాంత్‌కు గాయాలైనట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు. దీనిపై తాజాగా రజినీ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్‌ షూటింగ్‌ను పూర్తి చేశాను. నాకు గాయాలేమీ అవ్వలేదు. అడవి కాబట్టి ముళ్లు గుచ్చుకుని గీతలు పడ్డాయంతే. నేను బాగానే ఉన్నాను’ అని చెన్నై విమానాశ్రయం వద్ద మీడియా వర్గాలతో రజినీ మాట్లాడారు. త్వరలో ఈ షో డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం అవుతుంది. గతేడాది ఈ ఎపిసోడ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ ఎపిసోడ్‌ను డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారం చేయగానే 6.1 మిలియన్ మంది వీక్షించారు. ఆ ఛానెల్‌లో ప్రసారం అయిన ఏ ఎపిసోడ్‌ను అంతమంది వీక్షించలేదట. అయితే రజినీకాంత్ షూట్ చేసిన ఎపిసోడ్‌లో హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం రజినీ తన 168వ సినిమాతో బిజీగా ఉన్నారు. సిరుతాయ్ శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఖుష్బు, మీన కథానాయికలుగా నటిస్తున్నారు. కీర్తి సురేష్ కలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాకు ‘అన్నాత’ అనేే టైటిల్‌ను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తమిళంలో అన్నాత అంటే పెద్దన్న అని అర్థమట.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aPRNYJ

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...