Tuesday, 21 January 2020

‘డిస్కోరాజా’ ప్రీ బిజినెస్: ఫ్లాపులొచ్చినా మాస్ మహారాజాపై నమ్మకం పోలేదు!

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న సీనియర్ హీరోల్లో సరైన విజయం లేక ఇబ్బందిపడుతోన్న నటుడు మాస్ మహారాజా రవితేజ. హీరోగా, నటుడిగా తానేంటో నిరూపించుకున్న రవితేజ.. తన సినిమా బాక్సాఫీసు వద్ద మినిమం గ్యారంటీ వసూళ్లు రాబడుతుందనే నమ్మకం కలుగజేశారు. అయితే, ఈ మధ్య కాలంలో రవితేజ తీవ్రంగా నిరాశపరిచారు. కథల ఎంపికలో విఫలమవుతూ వరుస డిజాస్టర్లను చూశారు. రవితేజకు వరుసగా ఫ్లాపులొచ్చినా ట్రేడ్ వర్గాల్లో ఆయనపై నమ్మకంపై మాత్రం చచ్చిపోలేదు. ‘డిస్కోరాజా’తో రవితేజ మళ్లీ పూర్వ వైభవాన్ని పొందుతారని నమ్మకంతో ఉన్నారు. నిజానికి ‘నేల టిక్కెట్’ బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైన తరవాత కూడా కిందటేడాది డిస్ట్రిబ్యూటర్లు ‘అమర్ అక్బర్ ఆంటొని’పై బాగానే కాసులు కురిపించారు. ఈ సినిమా రూ.22 కోట్లకు అమ్ముడుపోగా కేవలం రూ.6 కోట్లు మాత్రమే షేర్ వసూలు చేసింది. డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర నష్టం జరిగింది. Also Read: అయినప్పటికీ, ‘అమర్ అక్బర్ ఆంటొని’ ప్రభావం ‘డిస్కోరాజా’ పడలేదు. ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ‘డిస్కోరాజా’ మంచి ప్రీ బిజినెస్ చేసింది. స్టన్నింగ్ టీజర్, మంచి పాటలు, అదిరిపోయే నిర్మాణ విలువలతో ప్రేక్షకులను ఆకర్షించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లను కూడా ఎట్రాక్ట్ చేసింది. దీంతో ‘డిస్కోరాజా’ థియేట్రికల్ రైట్స్‌ రూ.22 కోట్లకు అమ్ముడుపోయాయి. దర్శకుడు వీఐ ఆనంద్, మాస్ మహారాజా కలిసి కచ్చితంగా హిట్ ఇస్తారనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఇంత మొత్తం ‘డిస్కోరాజా’పై కురిపించారు. Also Read: ప్రస్తుతం ‘అల వైకుంఠపురములో’, ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మరి రవితేజ ‘డిస్కోరాజా’ కూడా బాక్సాఫీసును షేక్ చేస్తుందో లేదో చూడాలి. సినిమాలోని కంటెంట్, స్క్రీన్‌ప్లే బాగుంటే కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో రవితేజ సరసన ముగ్గురు హీరోయిన్లు నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ నటించారు. బాబీ సింహా విలన్‌ పాత్ర పోషించారు. తమన్ సంగీతం సమకూర్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TN4Nsm

No comments:

Post a Comment

What The Dhurandhar Girl Did Next

'The love I have received has been overwhelming.' from rediff Top Interviews https://ift.tt/1tJwmgl