సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరగుతున్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ప్రతీ సోమవారం ఓ అప్డేట్ను రిలీజ్ చేస్తున్నారు. త్వరలోనే కూడా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సరిలేరు నీకెవ్వరు రిలీజ్కు ముందే తదుపరి చిత్రాన్ని మహేష్ ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. మహేష్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మరోసారి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. మహర్షి సినిమాకు దర్శకత్వం వహించిన దగ్గర నుంచి మహేష్, వంశీల మధ్య మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. Also Read: మహర్షి తరువాత వెంటనే వంశీ దర్శకత్వంలో మహేష్ మరో సినిమా చేస్తున్నాడన్న టాక్ వినిపించింది. అయితే కథా కథనాలు సిద్ధంకాకపోవటంతో ఆ ఆలోచనను విరమించుకున్నాడు మహేష్. ఈలోగా సరిలేరు నీకెవ్వరు సినిమాను పూర్తి చేసిన మహేష్ ఇప్పుడు వంశీ దర్శకత్వంలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా దాదాపుగా మహేష్ నెక్ట్స్ ఇదే అని ఫిక్స్ అవుతున్నారు ఫ్యాన్స్. అంతేకాదు ఈ సినిమాతో మహేష్ తొలిసారిగా ఓ గ్యాంగ్స్టర్గా నటించనున్నాడట. గతంలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బిజినెస్మెన్ సినిమాలో గ్యాంగ్స్టర్ తరహా పాత్రలో కనిపించాడు మహేష్. కానీ నెక్ట్స్ సినిమాలో పూర్తి స్థాయి గ్యాంగ్స్టర్గా కనిపించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. Also Read: కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాకు అనిల్ రావిపూడి దర్శకుడు. ఈ సినిమాలో దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి చాలా కాలం తరువాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Pho8xU
No comments:
Post a Comment