Monday 9 December 2019

Nirbhaya తల్లిని కలిసిన పూనమ్ కౌర్

ఈ మధ్యకాలంలో నటి సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు ఆడవాళ్లపై జరుగుతున్న అక్రమాలపై ట్వీట్ల రూపంలో గళం విప్పుతుంటారు. ఈ నేపథ్యంలో పూనమ్.. ‘నిర్భయ’ తల్లిని కలిశారు. నిర్భయ కేసు నిందితుల రివ్యూ పిటిషన్‌ని సుప్రీంకోర్టు కొట్టివేసిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ నెల 16న వారిని ఉరితీయనున్నారని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో పూనమ్ నిర్భయ తల్లిని కలిశారు. ఆమెతో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘నిర్భయ నిందితులకు ఉరిశిక్ష పడుతుందని తెలిసి మన దేశం ఎంతో సంతోషిస్తుంది. ఈ నెల 16న నిర్భయకు న్యాయం జరగబోతోంది. చాలా కాలం పాటు ఎదురుచూశాం. దోషులు పెట్టుకున్న రివ్యూ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. నిర్భయ చేతన దివస్‌ రోజునే నిందితులను ఉరి తీయబోతున్నారు. ఈ నెల 16న యావత్ భారతదేశం ఎంతో సంతోషంగా ఉంటుంది. మన ప్రియమైన నిర్భయకు న్యాయం జరగబోతోంది. డిసెంబర్ 16 కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. అయితే ఉరి శిక్ష విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2012లో దిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ దేశవ్యాప్తంగా సంచనలం సృష్టించింది. తన స్నేహితుడితో కలిసి బస్సులో వెళుతున్న ‘నిర్భయ’ను ఐదుగురు వ్యక్తులు దారుణంగా రేప్ చేశారు. దాంతో దాదాపు 15 రోజుల పాటు చావు బతుకుల మధ్యకొట్టుమిట్టాడిన బాధితురాలు ప్రాణాలు విడిచింది. దాంతో ప్రభుత్వం నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DWcLWS

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...