సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ వరుస అప్డేట్స్తో అలరిస్తున్నారు. సినిమా రిలీజ్ వరకు ప్రతీ సోమవారం ఓ అప్డేట్ ఇచ్చేలా ప్లాన్ చేశారు చిత్రయూనిట్. గత వారం మైండ్ బ్లాక్ అనే మాస్ సాంగ్ రిలీజ్ చేసిన సరిలేరు నీకెవ్వరు టీం, ఈ సోమవారం ఓ మెలోడీ సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. సోమవారం సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు సినిమాలోని సూర్యుడివో చంద్రుడివో అనే సాంగ్ను రిలీజ్ చేయనున్నారు. Also Read: ఫస్ట్ సాంగ్ అంచనాలను అందుకోలేకపోవటంతో రెండో పాట కోసం సూపర్స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైండ్ బ్లాక్ సాంగ్ వ్యూస్ పరంగా రికార్డ్లు క్రియేట్ చేసినా మహేష్ అభిమానులను కూడా సాటిస్ఫై చేయలేకపోయింది. దీంతో రెండో పాటతో అభిమానులను మెప్పించేందుకు ప్లాన్ చేశాడు మహేష్. Also Read: మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి చాలా ఏళ్ల తరువాత సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తోంది. దీంతో సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్లతో పాటు అజయ్, బండ్ల గణేష్లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో నిర్మాత అనిల్ సుంకరతో కలిసి మహేష్ బాబు స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YqjO3k
No comments:
Post a Comment