ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్ సోమవారం 60వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణలో ఈ వేడుకలను గ్రాండ్గా నిర్వహించారు. వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, నట సింహ నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. బాలయ్య సతీమణి వసుంధర దేవితో సహా విచ్చేశారు. దర్శకుడు వినాయక్ కూడా ఈ వేడుకలో మెరిశారు. చిరు, బాలయ్య కేక్ కట్ చేసి కళ్యాణ్కు తినిపించారు. చిరు, బాలయ్య కార్యక్రమం జరిగినంత సేపు సరదాగా కబుర్లు చెప్పుకున్నారట. కళ్యాణ్ తన ప్రతీ పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎక్కడున్న ఈ వేడుకకు చిరంజీవి, బాలయ్య తప్పకుండా హాజరు అవుతూ ఉంటారు. 2011లో కళ్యాణ్ సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ను స్థాపించారు. ఈ బ్యానర్పై ఆయన నిర్మించిన తొలి చిత్రం ‘చంద్రలేఖ’. ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, లోఫర్, జై సింహా, ఇంటెల్లిజెంట్ తదితర సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆయన నిర్మించిన సినిమాలు తక్కువే అయినా చిత్ర పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఏ సినిమాకూ రాజీ పడకుండా డైరెక్టర్, హీరో హీరోయిన్లపై నమ్మకం ఉంచి డబ్బులు పెడుతుంటారు. ‘పరమవీరచక్ర’, ‘జైసింహా’ తర్వాత బాలయ్యతో కళ్యాణ్ ‘రూలర్’ సినిమా చేస్తున్నారు. త్వరలో బాలయ్య, వి.వి.వినాయక్ కాంబినషన్లో మరో సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఇందులో సోనల్ చౌహాన్ కథానాయికగా నటిస్తున్నారు. ‘రూలర్’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది. See Photo Story:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RDLoZA
No comments:
Post a Comment