దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్పై దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా ఈ సంఘటనపై సినీ తారలు తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సంఘటనపై లేడీ సూపర్ స్టార్ స్పందించింది. నిందితుల ఎన్కౌంటర్పై ఓ ప్రకటన విడుదల చేసింది నయనతార. `అన్యాయం జరిగిన వెంటనే న్యాయం జరిగితేనే అది సరైంది (Justice Is Good When Served Hot). సినిమాల్లో డైలాగ్లా అనిపించినా ఇప్పుడు ఇదే నిజమైంది. నిజమైన హీరోలు తెలంగాణ పోలీసులు ఈ రోజు తమ చర్యతో దాన్ని ప్రూవ్ చేశారు. నేను ఇదే మానవత్వాన్ని కాపాడే సరైన చట్టం అంటాను. Also Read: దేశంలోని ప్రతీ మహిళ ఈ రోజును క్యాలెండర్లో నిజమైన న్యాయం జరిగిన రోజుగా గుర్తుంచుకోవాలి. మానవత్వం అంటే అందరిపై సమానంగా గౌరవించటం, ప్రేమించటం, దయ చూపించటం. ఇప్పుడు జరిగిన ఈ న్యాయానికి సంతోషపడటం కన్నా.. మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా మన ఇళ్లలోని మగ పిల్లల్ని.. ఈ ప్రపంచం మహిళలకు సురక్షితంగా మార్చిన వాడే అసలైన మగాడు అన్న విషయం తెలియజేయాలి` అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది నయనతార. ఇక సినిమాల విషయానికి వస్తే.. ఈ భామ తమిళ్లో మూడు సినిమాల్లో నటిస్తోంది. రజనీకాంత్, మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దర్బార్ సినిమాతో పాటు నెట్రికన్న్, ముక్తి అమ్మాన్ సినిమాల్లో నటిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం సౌత్లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న నయన్ లేడీ సూపర్ స్టార్గా తన ఇమేజ్ను కాపాడుకుంటోంది. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2PkSb7W
No comments:
Post a Comment