Tuesday, 17 December 2019

ఘనంగా ప్రభాస్ హీరోయిన్ పెళ్లి.. ప్రియుడినే చేసుకుంది

‘మిరపకాయ’, ‘మిర్చి’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పెళ్లి చేసుకున్నారు. తన చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను వివాహమాడారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిచా, జో స్కూల్‌లో బెస్ట్ ఫ్రెండ్స్. తమ చిన్ననాటి స్నేహం పెద్దయ్యాక ప్రేమగా మారింది. ఈ ఏడాది జనవరిలో రిచా జోని నిశ్చితార్థం చేసుకున్నారు. మంగళవారం విదేశంలో హిందు, క్రైస్తవ సంప్రదాయంలో పెళ్లి జరిగింది. 2007లో మిస్ ఇండియా యూఎస్‌ఏ టైటిల్ గెలుచుకున్న రిచా.. 2010లో ‘లీడర్’ సినిమాతో తన సినీ జర్నీని ప్రారంభించారు. ఈ సినిమాలో రిచా.. రానా దగ్గబాటికి జోడీగా నటించారు. ఆ తర్వాత ‘నాగవల్లి’, ‘మిరపకాయ్’, ‘సారొచ్చారు’, ‘మిర్చి’ సినిమాల్లో నటించారు. చివరిగా రిచా 2013లో వచ్చిన ‘భాయ్’ సినిమాలో నటించారు. ఆ తర్వాత సినిమాలు మానేసి తన స్వస్థలమైన అమెరికా వెళ్లిపోయారు. సినిమాలకు గుడ్ బై చెప్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమాలే తన జీవితం కాదని అంతకుమించి చేయాల్సినవి చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాదు సోషల్ మీడియాకు కూడా గుడ్ బై చెప్తున్నట్లు ప్రకటించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36MzvEY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....