టాలీవుడ్ చందమామ, సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ తన భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి హనీమూన్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. రెండు వారాల క్రితం పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ ప్రేమ జంట ఇటీవలే హనీమూన్ ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడి అందమైన ప్రదేశాలను చుట్టేస్తూ ఎంజాయ్ చేస్తోంది ఈ కొత్త జంట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసిన కాజల్.. తాజాగా మరొకొన్ని రొమాంటిక్ ఫోటోలు షేర్ చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ హాయిగా షికారు చేస్తున్న కాజల్- గౌతమ్ జోడీ.. ఓ అండర్ వాటర్ బెడ్ రూమ్లో సేదతీరారు. రొమాంటిక్ మూడ్లో ఇద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అందమైన బెడ్రూమ్లో సముద్ర అందాలు, చేపలను తిలకిస్తూ కనిపిస్తోంది ఈ కొత్తజంట. భర్తతో ఫోటోలకు పోజులివ్వడమే గాక, సోలోగా కిక్కిచ్చే ఫోజులతో మతిపోగొట్టింది కాజల్. ప్రస్తుతం ఆన్లైన్ వేదికలపై ఎక్కడ చూసినా ఈ ఫొటోలే కనిపిస్తుండటం విశేషం. Also Read: అక్టోబర్ 30న తన ప్రియుడు గౌతమ్ కిచ్లూని పెళ్లి చేసుకున్న రోజు నుంచి కాజల్ పేరు సోషల్ మీడియాలో మారు మ్రోగిపోతోంది. వీరి పెళ్లి సంగతులతో పాటు హనీమూన్ విశేషాలు సామజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతున్నాయి. మరో వారం రోజుల్లో హనీమూన్ ట్రిప్ ముగించుకొని తిరిగి రానుందట ఈ జోడీ. వచ్చి రాగానే తన సినిమా షూటింగులతో బిజీ కానుంది కాజల్ అగర్వాల్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36qCLYd
No comments:
Post a Comment