సినిమాలో హీరో రెండు ఫైట్లు, నాలుగు పంచ్ డైలాగులు, మూడు పాటల్లో డ్యాన్సులు చేస్తే ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. అలాంటిది ఒకే సినిమాలో ఇద్దరు హీరోలు కనిపిస్తే.. అది కూడా ఒకే కుటుంబానికి చెందిన వారైతే ఇక ఆ సినిమాకు వచ్చే క్రేజే వేరుగా ఉంటుంది. ఒకే టిక్కెట్పై రెండు సినిమాలు చూస్తున్నంత సంబరపడిపోతుంతారు అభిమానులు. అక్కనేని కుటుంబమంతా కలిసి తీసిన ‘మనం’ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఈ కోవలోనే దగ్గుబాటి హీరోలు కూడా ఒకే తెరపై కనిపించేలా సన్నాహాలు జరుగుతున్నారు. Also Read: ప్రస్తుతం చిరంజీవి - రామ్చరణ్ కలిసి ‘ఆచార్య’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలు వెంకటేష్, రానా కలిసి ఓ సినిమా చేయనున్నారు. ఆ చిత్రాన్ని వచ్చే యేడాదిప్రకటించబోతున్నారు. ఆ విషయాన్ని రానా స్వయంగా వెల్లడించారు. బాబాయ్తో కలిసి తాను సినిమా చేస్తున్నానని, స్టోరీతో పాటు మిగతా ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయని రానా తెలిపారు. అయితే రానా ‘విరాటపర్వం’ , ‘నారప్ప’ షూటింగుల్లో బిజీగా ఉన్నారు. అవి రెండూ పూర్తయిన తర్వాత ఈ మల్టీస్టారర్పై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. Also Read: గతేడాది వెంకటేష్, తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి ‘వెంకీమామ’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ కోవలోనే ఈ సారి బాబాయ్-అబ్బాయ్ కలిసి వెండితెరపై సందడి చేయనున్నారన్నమాట. అయితే వీరిద్దరు సినిమాలో కనిపింంచడం ఇదే తొలిసారి కాదు. క్రిష్, రానా కాంబినేషన్లో తెరకెక్కించిన ‘కృష్ణం వందే జగద్గురుం’ సినిమాలోని ఓ పాటలో వెంకటేష్ కాసేపు సందడి చేశారు. మరోవైపు మల్టీస్టారర్ సినిమాల్లో నటించడం వెంకటేష్కు కొత్తేమీ కాదు. మహేశ్బాబుతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, పవన్ కళ్యాణ్తో ‘గోపాల గోపాల’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2If9NlM
No comments:
Post a Comment