తెలుగు, కన్నడ పరిశ్రమలో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రష్మిక మందానాకు సాఫ్ట్వేర్ దిగ్గజం సర్ప్రైజ్ ఇచ్చింది. ఈ ఏడాదికి గాను ‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా రష్మిక గుర్తింపు సాధించింది. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా అని గూగుల్లో సెర్చ్ చేయగా.. రష్మిక మందన్న పేరు కనిపిస్తోంది. ‘.. నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా మారింది. ఆమె దుస్తుల ఎంపిక మమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఆమె సరికొత్త లుక్ మరింత ఆకట్టుకుంటోంది’ అని కామెంట్ కనిపిస్తోంది. Also Read: కన్నడలో ‘కిరిక్ పార్టీ’ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రష్మిక.. ‘ఛలో’ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ‘గీత గోవిందం’తో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని టాప్ హీరోయిన్గా మారింది. ప్రస్తుతం బన్నీ-సుక్కు కాంబినేషన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’లో నటిస్తోంది. ఈ క్రమంలోనే రష్మికకు గూగుల్ సర్ప్రైజ్ ఇవ్వడంపై ఆమె ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3pMt8fm
No comments:
Post a Comment