Sunday 1 November 2020

ఏపీలో అక్కడ థియేటర్లు ఓపెన్.. మొత్తానికి బొమ్మ పడింది, ఆ రెండు సినిమాలు!

అయ్యాయి. విజయవాడలో చాలా రోజుల తర్వాత బొమ్మ పడింది. విజయవాడలో ఆదివారం గాంధీనగర్‌లోని ఐనాక్స్‌, అశోక్‌నగర్‌లో సినీపొలీస్‌ మల్టీప్లెక్స్‌లో ఒక్కో స్క్రీన్ తెరిచారు. సరిలేరు నీకెవ్వరు, కనులు కనులను దోచాయంటే లాంటి సినిమాలను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. ఇప్పట్నుంచి ప్రతీవారం వచ్చే ప్రేక్షకులను బట్టి థియేటర్స్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. మిరాజ్‌ ఆధీనంలో ఉన్న శాంతి, ప్రశాంతి థియేటర్లు కూడా తెరుస్తారని భావించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అది శుక్రవారానికి వాయిదా పడింది. విశాఖలో కూడా ఒకటి రెండు థియేటర్లు తెరుచుకున్నాయి. దీపావళికి మరికొన్ని థియేటర్లు తెరుచుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం అన్‌లాక్‌లో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరుచుకోవచ్చు అని అనుమతి ఇవ్వడంతో.. రోజుకి మూడు షోలు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రెండు గంటలు ముందుగానే బాక్స్ ఆఫీస్‌లు ఓపెన్ చేస్తున్నారు. ఈ మల్టీఫ్లెక్స్‌లు క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్, పేపర్ లెస్ టికెట్లతో నడవనున్నాయి. మల్టీఫ్లెక్స్‌లలో 50 శాతం ఆక్యుపెన్సీతో సీటింగ్ ఏర్పాట్లు చేశారు. అలాగే కేంద్రం చేసిన సూచనల ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కరోనా దెబ్బకు మార్చిలో థియేటర్లు, మల్లీప్లెక్స్‌లు మూతపడ్డాయి. అన్‌లాక్‌ 5.0లో భాగంగా కేంద్రం థియేటర్లు పునఃప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా మార్గదర్శకాలు విడుదల చేశాయి. థియేటర్ల పునఃప్రారంభంపై థియేటర్లు యాజమాన్యాలు విజయవాడలో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి.. చివరికి మల్లీప్లెక్స్‌లు తెరిచేందుకు నిర్ణయం తీసుకున్నాయి. తెలంగాణలో ఇంకా ఎప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతాయో క్లారిటీ లేదు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/34O1eqX

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...