Tuesday 10 November 2020

‘రాధేశ్యామ్’ షాకింగ్ అప్‌డేట్... క్లైమాక్స్ కోసం రూ.30కోట్లతో సెట్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘’. ‘జిల్‌’ ఫేమ్‌ రాధాకృష్ణ కుమార్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్‌ పూర్తిచేసుకున్న యూనిట్ ఇండియాకి తిరిగొచ్చింది. తాజాగా హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో క్లైమాక్స్‌కు సంబంధించి కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఏకంగా రూ.30కోట్ల ఖర్చుతో ఓ సెట్ వేయనున్నట్లు సమాచారం. హాలీవుడ్‌ మూవీ ‘గ్లాడియేటర్‌’కి యాక్షన్‌ కొరియోగ్రఫీ అందించిన నిక్‌ పోవెల్‌ ‘రాధేశ్యామ్‌’కి వర్క్‌ చేస్తున్నారు. Also Read: ఆయన పర్యవేక్షణలోనే ఈ సినిమా క్లైమాక్స్‌ యాక్షన్‌ సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. యూరోప్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా తెరకెక్కనున్న ఈ సినిమాలో క్లైమాక్స్‌ భారీ స్థాయిలో చిత్రీకరించాలని దర్శకుడు రాధాకృష్ణ ప్లాన్ చేస్తున్నారు. ఈ కోవలోనే ఆఖరి పోరాట సన్నివేశాల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేస్తుండటం టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35nI9MB

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6