స్నేహితుడి మాయమాటలు నమ్మి అవసరం కోసం అప్పు ఇచ్చిన టాలీవుడ్కు చెందిన ఓ మ్యూజిక్ డైరెక్టర్ మోసపోయారు. సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ వద్ద ఏకంగా రూ.28 తీసుకొని ఓ వ్యక్తి మోసం చేయడం గమనార్హం. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్లో నివాసం ఉండే వందేమాతరం శ్రీనివాస్కు.. రోజూ ఉదయం వాకింగ్కు వెళ్లడం అలవాటు. ఈ క్రమంలో అపోలో ఆస్పత్రి సమీపంలో నివసించే తిరుపతయ్య పరిచయం ఆయనకు అయ్యాడు. 2018 నుంచి వీరు రోజూ మార్నింగ్ వాక్ కలిసే చేసేవారు. ఈ క్రమంలో గత జూన్లో తిరుపతయ్య కర్నూల్కు చెందిన తన మామ, కాంట్రాక్టర్ రంగస్వామితో కలిసి వందేమాతరం శ్రీనివాస్ ఇంటికి కూడా వెళ్లారు. తనకు ఆర్థికంగా అత్యవసరంగా డబ్బు అవసరం ఉందని, ఓ రూ. 30 లక్షలు సర్దితే నాలుగు నెలల్లో తిరిగి ఇచ్చేస్తామని కోరారు. వారి మాటలు నమ్మిన శ్రీనివాస్ రెండు సార్లు రూ.పది లక్షల చొప్పున, మరోసారి రూ.8 లక్షలు ఇచ్చారు. తర్వాత నాలుగు నెలలు గడిచినా డబ్బు ఊసెత్తకపోవడంతో తన స్నేహితుడితో కలిసి వందేమాతరం తిరుపతయ్య ఇంటికి వెళ్లారు. డబ్బు ఎప్పుడు తిరిగిస్తావని అడిగితే.. అతను నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా బెదిరింపులకు దిగడం గమనార్హం. దీంతో వందేమాతరం శ్రీనివాస్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3948wt0
No comments:
Post a Comment