Friday 6 November 2020

సిల్వర్‌ స్క్రీన్‌పై 14ఏళ్ల తర్వాత.. జంటగా సూర్య-జ్యోతిక

సూర్య, జ్యోతిక... వెండితెరపై మోస్ట్ సక్సెస్‌ఫుల్ జంటగా గుర్తింపు పొందిన వీరిద్దరు ప్రేమలో పడి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంట ఏడు సినిమాల్లో కలిసి నటించారు. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకుంటున్నారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ తన సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో , జ్యోతిక మళ్లీ కలిసి నటిస్తే చూడాలన్నది ప్రేక్షకుల కోరిక. దీంతో వాళ్లిద్దరు ఎక్కడికెళ్లినా మళ్లీ కలిసి ఎప్పుడు నటిస్తున్నారు? అంటూ ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. Also Read: ‘కలిసి కనిపించాల్సిన కథ వస్తే మళ్లీ ఆన్‌స్క్రీన్‌ మీద జోడీగా కనబడతాం’ అని సూర్య అనే ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్లు కనిపిస్తోంది. పద్నాలుగేళ్ల తర్వాత వీళ్లిద్దరూ సిల్వర్ స్క్రీన్‌ మీద మళ్లీ కనిపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. మలయాళ దర్శకురాలు అంజలీ మీనన్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. తమిళ చిత్రం ‘సిల్లు కరుప్పాట్టి’ దర్శకురాలు హలితా షహీమ్‌తో కలసి అంజలీ మీనన్‌ కథ సిద్ధం చేస్తున్నారని కోలీవుడ్‌తో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తారో మరి. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eB4vNs

No comments:

Post a Comment

'We Attribute Failure To The Director'

'Our analysis of success, like failure, is so reductive and so one dimensional that we don't look at the bigger picture.' from...