Saturday, 3 October 2020

ఒక్కడు కాదు ఇద్దరు.. మహేష్ బాబు డబుల్ ధమాకా.. దద్దరిల్లిపోతుందంటున్న సూపర్ స్టార్

కేవలం సినిమాలతోనే గాక ఇతర మార్గాల్లోనూ ఆదాయాన్ని అన్వేషిస్తుంటారు సూపర్ స్టార్ . పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు సినిమా నిర్మాణాల్లో భాగమవుతుండటం చూస్తున్నాం. మరోవైపు జీఎంబీ సినిమాస్ పేరుతో భారీ ముల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేసిన ఆయన.. ఈ లాక్‌డౌన్ విరామ సమయంలో ఓ యాడ్ షూట్ చేశారు. కరోనా కారణంగా గత ఆరు నెలలుగా ఇంటికే పరిమితమైన మహేష్ ఈ యాడ్ షూట్‌తో డబుల్ ధమాకా ట్రీట్ ఇచ్చారు. తాజాగా విడుదలైన ఈ యాడ్‌‌లో మహేష్ బాబు వేషం అదుర్స్ అనిపిస్తోంది. ఇందులో అన్నదమ్ములుగా రెండు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించిన ఆయన.. తన సొంత వాయిస్‌తో ఆకట్టుకున్నారు. ఓ లుక్‌లో చాలా యంగ్‌గా, మరో లుక్‌లో పంచకట్టి మెలితిరిగిన మీసంతో జబర్దస్త్‌గా కనిపించారు. ఓ ఆన్‌లైన్ ఉత్పత్తుల సేల్ కంపెనీ కోసం చేసిన ఈ యాడ్‌లో.. ఇక దద్దరిల్లిపోవాల్సిందే అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఎన్నడూ లేనివిధంగా మెలితిగిన మీసంతో మహేష్ కనిపించడంతో ఈ లుక్ వైరల్ అవుతోంది. Also Read: మహేష్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో సక్సెస్ అందుకున్న ఆయన, ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్టు 'సర్కారు వారి పాట' కోసం ప్రిపేర్ అవుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ అతిత్వరలో సెట్స్ మీదకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ సంయుక్తంగా సమర్పిస్తున్న ఈ సినిమాకు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. థమన్ బాణీలు కడుతున్నారు. చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్‌ని హీరోయిన్‌గా కన్ఫర్మ్ చేసినట్లు తెలిసింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cSBcoA

No comments:

Post a Comment

'Indian Bank Aims For Rs 25 Trl Business By Dec 2030'

'In the last one year, we have added more than Rs 1.7 trillion, and we are on track.' from rediff Top Interviews https://ift.tt/tN...