Sunday, 6 September 2020

Sonu Sood కంటే వైఎస్ భారతి లక్ష రెట్లు గొప్ప.. పోసాని సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు సినీ నటుడు కృష్ణ మురళి. రాష్ట్రంలో జనాలకు చాలా సమస్యలున్నాయి.. వారిని జగన్ ఆదుకుంటున్నారన్నారు. విద్యార్థులు, మహిళలు, వెనుకబడిన వర్గాల వారికి చాలా చేస్తున్నారని.. రైతులు, చేనేతలు, ఆటో డ్రైవర్లను ఆదుకున్నారన్నారు. జగన్ పుట్టుక ముందే ఆయన కుటుంబం ఇన్‌కమ్ ట్యాక్స్ కడుతోందని.. 15 రోజులు పులివెందుల్లో ఉన్నా.. అక్కడి జనాలతో మాట్లాడినట్లు చెప్పుకొచ్చారు. ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పులివెందుల్లో 10 కాలనీలు ఎస్సీ, ఎస్టీలకు ఉన్నాయన్నారు పోసాని. స్థలం కొనుగోలు చేసి ఇళ్లు కట్టించారని.. వైఎస్ ఫ్యామిలీ 5లక్షలమందికి కంటి ఆపరేషన్లు చేయించారన్నారు. వికలాంగులు, మానసిక వికలాంగులకు జగన్‌తో కలిసి సొంత డబ్బులతో ప్రత్యేకంగా స్కూల్స్ ఏర్పాటు చేశారని చెప్పారు. ఇవన్నీ ఎవరైనా చెప్పుకుంటారా.. సోనూసూద్ కంటే లక్ష రెట్లు బెటర్ సేవ చేస్తున్నారు వైఎస్ భారతి.. ఎప్పుడైనా ఆమె చెప్పుకున్నారా అంటూ వ్యాఖ్యానించారు. తాను రాజకీయాల్లో ఉన్నా ఎప్పుడూ ఏ పదవి ఆశించలేదన్నారు. ప్రజారాజ్యం సమయంలో కూడా తాను ఎమ్మెల్యే టికెట్ కావాలని ఎప్పుడూ అడగలేదన్నారు. ఇక ఏపీలో మూడు రాజధానుల విషయంపై స్పందించిన ఆయన.. పరిపాలనా వికేంద్రీకరణ మంచి నిర్ణయమే అన్నారు. అమరావతి రైతులకు కూడా జగన్ న్యాయం చేస్తారన్నారు. ఏపీ సీఎం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని.. రాష్ట్రంలో ప్రాజెక్టుల్ని కూడా త్వరగా పూర్తి చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశ పెట్టడం మంచి నిర్ణయం అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2FgCxc0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....