Monday, 28 September 2020

Sri Reddy: టాలీవుడ్‌పై ఉమ్మేసిన శ్రీ రెడ్డి.. బాలు చనిపోతే ఒక్కడైనా వచ్చాడ్రా? తూ.. శివాలెత్తిన హాట్ బాంబ్

ఏ చిన్న అవకాశం దొరికినా టాలీవుడ్‌ పెద్దలపై విరుచుకుపడుతున్న హాట్ బాంబ్ మరోసారి రెచ్చిపోయింది. లెజెండరీ సింగర్ అంత్యక్రియలకు టాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరు కాకపోవడాన్ని తప్పుబడుతూ శివాలెత్తిపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలు దొంగ కన్నీరు కార్చుతున్నారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఉమ్మేస్తున్నారిక్కడ అంటూ ఆవేదన చెందిన శ్రీ రెడ్డి.. టాలీవుడ్ నటిని అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె విడుదల చేసిన వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఈ వీడియోలో శ్రీ రెడ్డి మాట్లాడుతూ.. ''ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణంతో తెలుగు సినీ పరిశ్రమ మూల స్తంభాన్ని కోల్పోయింది. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే ఆయన మరణం తర్వాత ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతూ అన్నయ్యా.. వెళ్లిపోయావా? అంటూ దొంగ కన్నీరు కార్చారు తప్ప కడసారి చూపు కోసం రాలేదు. ఆయన వాయిస్ లేనిదే మెగాస్టార్లు టాలీవుడ్‌లో అనేవాళ్ళే లేరు. ఆయన గాత్రంతోనే వాళ్ళను స్టార్స్ చేశారు. అయితే ఓ స్టేజ్ వచ్చాక అదే స్టార్స్ మళ్ళీ ఆయనను ఇబ్బందులు పెట్టడమే గాక.. ఆ గాన గంధర్వుడి మరణం తర్వాత టాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా రాకపోవడం సిగ్గుచేటు. Also Read: మా అసోసియేషన్ నుంచి కూడా ఒక్కడూ రాలేదు. రావాలనే ఉద్దేశ్యమే ఉంటే చిరంజీవి లాంటి హీరోలు రాలేరా? ఆ బోడి గుండులు ఫోటోలు తీసుకుంటూ పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ బాలు అంత్యక్రియలకు మాత్రం రాలేరా? మీ కొడుకులను, మేనల్లుళ్ళను ప్రమోట్ చేయడంలో ఉన్న శ్రద్ద.. ఇంతపెద్ద గాన గంధర్వుడు పోతే రాకపోవడం సిగ్గుగా ఉంది. ఒక్కనాకొడుకు రాలేదని తమిళనాడులో టాలీవుడ్‌పై ఉమ్మేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులకు ఓ గౌరవం తెలియదు.. ఓ పద్దతి తెలియదు. ఎప్పుడూ వేదికలపై కొట్టుకుంటూ నీచానికి దిగజారి పోయారు. అందరూ డబ్బు మాయలో పడిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళ అంత్యక్రియలకు వెళతారు కానీ మీ కెరీర్ నిలబెట్టిన వారిని చివరిచూపు చూడలేరా? షేమ్ షేమ్.. చెన్నైలో నా పరువు పోయింది. నేను బాలు గారి అంత్యక్రియలకు వెళ్ళా కానీ టాలీవుడ్ తరుపున కాదు.. కోలీవుడ్ తరుపున. తెలుగు అమ్మాయిగా గర్వపడుతున్న నేను.. తెలుగు యాక్టర్‌గా చెప్పుకోవడాని సిగ్గుపడుతున్నా. మీకూ మరణం వస్తుంది. అది గుర్తు పెట్టుకోండి.. చేసిన పాపాలకు అనుభవించి మరీ పోతారు ఒక్కొక్కరు. ఇక్కడికొస్తే కాదురా.. మీరు గుమ్మం దాటి బయటకొచ్చినా కరోనా వస్తుంది. తూ'' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది శ్రీ రెడ్డి. ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cDyWkY

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....