Monday, 28 September 2020

మరోసారి కల నెరవేరింది.. నా దేవుడు పవన్‌కు ధన్యవాదాలు: బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ‘గబ్బర్ సింగ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని నిర్మించిన నిర్మాత బండ్ల గణేష్.. మరోసారి ఆయనతో కలిసి పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఒక మంచి కథ కోసం చూస్తున్నానని.. దొరకగానే తన దేవుడి దగ్గరకి వెళ్లి అడుగుతానని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఆ సమయం వచ్చేసింది. బండ్ల గణేష్‌కు మరోసారి ఓకే చెప్పారు. వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘‘నా భవిష్యత్తును ఈరోజు 11.23 గంటలకు ప్రకటిస్తాను. నా శ్రేయోభిలాషులకు ఇదొక అద్భుతమైన వార్త’’ అని సోమవారం ఉదయం బండ్ల గణేష్ ముందుగా ట్వీట్ చేశారు. ఆ తర్వాత చెప్పిన సమయానికే తాజాగా పవన్ కళ్యాణ్‌తో తీసుకున్న ఫొటోను ట్వీట్ చేసి.. ‘‘నా బాస్ ఓకే చెప్పారు. మరోసారి నా కల నెరవేరుతోంది. నా దేవుడు పవన్ కళ్యాణ్‌కు ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో 2012లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ‘గబ్బర్ సింగ్’ తరవాత బండ్ల గణేష్ ఐదు సినిమాలు నిర్మించినా అవేవీ పవన్ కళ్యాణ్ చిత్రమంత సక్సెస్ కాలేకపోయాయి. మరి ఇప్పుడు మళ్లీ తన దేవుడితో బండ్ల ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుంటారో చూడాలి. ఇదిలా ఉంటే, రెండేళ్లకు పైగా రాజకీయాలతో బిజీగా ఉండి మళ్లీ ముఖానికి రంగు వేసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలను అంగీకరిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ చివరి దశలో ఉంది. క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ మూవీ షూటింగ్ ప్రారంభంకావాల్సి ఉంది. ఈ సినిమా తరవాత హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. బహుశా ఈ సినిమా తరవాత బండ్ల గణేష్ నిర్మాతగా పవన్ సినిమా ఉంటుంది. మరిన్ని వివరాలు ప్రకటించాల్సి ఉంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iaH79N

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....