సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య తర్వాత సినీ వర్గాలకు కుదిపేసే ఎన్నో అంశాలు బయటకొస్తున్నాయి. డ్రగ్స్ రాకెట్, నెపోటిజంపై కొందరు నటీనటులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. కాగా సుశాంత్ డిప్రెషన్ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని తెలుస్తుండటంతో నటీనటుల డిప్రెషన్పై కూడా పెద్దఎత్తున చర్చలు మొదలయ్యాయి. తాజాగా ఈ అంశంపై హీరోయిన్ రియాక్ట్ అవుతూ సీక్రెట్స్ బయటపెట్టింది. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసుపై ఇటు సీబీఐ, అటు ఎన్సీబీ లోతుగా విచారణ చేస్తోంది కాబట్టి ఆ కేసుపై తాను కొత్తగా చెప్పడానికి ఏమీ లేదని పేర్కొన్న మెహ్రీన్.. నిజ జీవితంలో ఒత్తిడి (డిప్రెషన్) మాత్రం జీవితాలను అద్వాన్నంగా మార్చేస్తుందని తెలిపింది. తాను కూడా డిప్రెషన్ బాధితురాలినేనని, ఒకానొక సమయంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యానని చెప్పింది మెహ్రీన్. అయితే ఆ ఒత్తిడి నుంచి ఎంతత్వరగా బయటపడ్డాం అనేది చాలా ముఖ్యమని ఆమె తెలిపింది. Also Read: నిజం చెప్పాలంటే ఈ బిజీ లైఫ్లో మానవ జాతి మొత్తం డిప్రెషన్కి లోనవుతోందని చెప్పిన మెహ్రీన్.. జీవితం చాలా అందమైంది అనే విషయాన్ని పదేపదే గుర్తుచేసుకుంటూ మనల్ని మనం నమ్మడంతో పాటు దేవుడిని నమ్మాలని చెప్పింది. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడపడం వల్ల డిప్రెషన్ నుంచి ఈజీగా బయటపడొచ్చని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు తాను మోడలింగ్ మాత్రమే చేశానని చాలామందికి తెలుసు కానీ.. తాను ఎయిర్ పిస్టల్ గేమ్లో నేషనల్ ప్లేయర్ అనే విషయం ఎవ్వరికీ తెలియదంటూ సీక్రెట్ చెప్పేసింది మెహ్రీన్. అలాగే తాను మూవీలో కూడా నటించబోతున్న విషయాన్ని బయటపెట్టింది మెహ్రీన్. ఈ చిత్రంలో తనతో పాటు ప్రైమరీ కాస్టింగ్ మొత్తం ఉంటుందని, ఈ కరోనా ప్రభావం లేకుంటే ఈ పాటికి ఎప్పుడో సెట్స్ మీదకు వచ్చే వాళ్లమని ఆమె తెలిపింది. అనిల్ రావిపూడి రూపొందించిన హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్2 లో సందడి చేసిన ఆమె ఎఫ్3 షూటింగ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని పేర్కొంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3csl6lC
No comments:
Post a Comment