Tuesday, 1 September 2020

Jr Ntr: మిస్ యూ నాన్నా.. తారక్ భావోద్వేగ పోస్ట్

దివంగత నటుడు, ఎన్టీఆర్ కుమారుడు 64వ జయంతి సందర్భంగా తండ్రిని తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు . తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ ఎమోషనల్ పోస్ట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘ మిస్ యూ నాన్నా.. ఈ అస్తిత్వం మీరు. ఈ వ్యక్తిత్వం మీరు.. మొక్కవోని ధైర్యంతో కొనసాగే మా ప్రస్థానానికి నేతృత్వం మీరు . ఆజన్మాంతం తలుచుకునే అశ్రుకణం మీరే’.. మీ 64వ జయంతిన మిమ్మల్ని స్మరించుకుంటూ మీ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావు’ అంటూ ట్విట్టర్ ద్వారా భావోద్వేగ మెసేజ్‌ను అభిమానులతో పంచుకున్నారు తారక్. ఎన్టీఆర్ రధసారథిగా.. రాజకీయ నాయకుడిగా.. ఖ్యాతి గడించిన నందమూరి హరికృష్ణ 2018 ఆగష్టు 29న నల్గొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bgkrTI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....