Sunday, 13 September 2020

Drugs Racket: అంతా తూచ్.. డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ సంచలన స్టేట్‌మెంట్.. రకుల్‌కి క్షమాపణ చెప్పిన సమంత

సుశాంత్ సింగ్ మరణం తర్వాత అనూహ్యంగా తెరపైకి వచ్చిన డ్రగ్స్ ఇష్యూ సంచలనంగా మారింది. ఈ కేసులో అరెస్ట్ అయిన సుశాంత్ ప్రేయసి డ్రగ్స్ వాడానని పేర్కొడమే గాక సుశాంత్ కోసం మత్తు పదార్థాలు తెప్పించేదాన్నని తెలిపింది. ఈ క్రమంలోనే మరో 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ పెడల్స్‌తో సంబంధాలున్నాయని అధికారులకు రియా చెప్పినట్లు గత రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందులో , కూడా ఉన్నారని తెలియడంతో అంతా షాకయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై ఎన్‌సీబీ అధికారులు సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఎన్‌సీబీ డిప్యూటీ డైరెక్టర్ కేపీఎస్ మల్హోత్రా మాట్లాడుతూ డ్రగ్స్ విషయమై మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. ఇప్పటివరకు రియా కేవలం డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు మాత్రమే చెప్పిందని, 25 మంది బాలీవుడ్ ప్రముఖులకు డ్రగ్స్ పెడల్స్‌తో సంబంధాలున్నాయని వస్తున్న వార్తలు నిజం కాదని ఆయన పేర్కొన్నాడు. ఇక డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ పేర్లు కూడా ఇందులో లేవని చెబుతూ సంచలన విషయం బయటపెట్టారు. Also Read: తమ దగ్గరున్న జాబితాలో కేవలం డ్రగ్స్ స్మగ్లర్ల పేర్లు మాత్రమే ఉన్నాయని మల్హోత్రా తెలిపారు. సుశాంత్‌తో కలిసి బాలీవుడ్ స్టార్స్ లూనావాలా ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ సేవించినట్టు వచ్చిన వార్తలు కూడా అవాస్తవమని అన్నారు. ఇదంతా కేసును తప్పుదోవ పట్టించేందుకు జరుగుతున్న కుట్ర అని ఆయన అన్నారు. కాగా డ్రగ్స్ కేసులో రకుల్, సారా తప్పులేదని తెలియగానే రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్‌లకు అందరి తరఫున క్షమాపణలు చెప్పింది . పలువురు నెటిజన్స్ సైతం 'సారీ రకుల్, సారీ సారా' అంటూ సందేశాలు పోస్ట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bWUvga

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....