డ్రగ్స్ రాకెట్ కన్నడ సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీ అరెస్ట్తో సినీ ఇండస్ట్రీ మొత్తం షాకైంది. వారి బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో ఈ ఇద్దరితో పాటు రాహుల్ తొన్సే, పెప్పర్ సాంబా, నియాజ్ మహ్మాద్, ప్రశాంత్ రంకాను సెప్టెంబర్14వ తేదీ వరకు పోలీస్ కస్టడీకి తరలించారు. అయితే ఈ కేసులో కీలకంగా ఉన్న ప్రశాంత్ సంబర్గీ విచారణలో సంజనకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. Also Read: విచారణలో భాగంగా అతడు అనేక మంది సినీ సెలబ్రిటీల పేర్లను బయటపెట్టినట్లు సమాచారం. గతంలో శ్రీలంక క్యాసినీలో నిర్వహించిన డ్రగ్స్ పార్టీకి అనేక మంది సినీతారలు హాజరయ్యారని, చమ్రాజ్పేట్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్తో కలిసి సంజన ఆ పార్టీకి వచ్చిందని ప్రశాంత్ చెప్పినట్లు ఓ పత్రిక కథనం ప్రచురించింది. Also Read: ఈ కథనంతో ఉలిక్కిపడిన జమీర్ అహ్మద్ ఆ వార్తలను ఖండించారు. హీరోయిన్ సంజన ఎవరో తనకు తెలీదని, ఆమె సినిమాలు కూడా ఎప్పుడూ చూడలేదని చెప్పారు. ముక్కు, మొహం తెలియని తాను ఆమె శ్రీలంక వెళ్లానని ఎలా ప్రచారం చేస్తారంటూ మండిపడుతున్నారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ms5wuS
No comments:
Post a Comment