ప్రముఖ సినీ నటుడు (74) కన్నుమూశారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారు జామున గుండెపోటు రావడంతో బాత్రూమ్లోనే కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే ఆయన తుదిశ్వాస విడిచారు. లాక్డౌన్ కారణంగా సినిమా షూటింగ్లపై ప్రభుత్వం నిషేధించడంతో అప్పటి నుంచి ఆయన గుంటూరు లోనే ఉంటున్నారు. జయప్రకాశ్ రెడ్డి మరణ వార్త విని సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. జయప్రకాశ్ రెడ్డి 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. 1997లో విడుదలైన ప్రేమించుకుందాం రా చిత్రం ప్రతినాయకునిగా మంచి పేరు సంపాదించారు. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ''సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు'' లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించి టాలీవుడ్ సినిమాలతో బిజీ అయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R5i4tu
No comments:
Post a Comment