బాలీవుడ్ సూపర్స్టార్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్కు హైదరాబాద్ కూకట్పల్లి కోర్టు షాకిచ్చింది. ఆయన నటించిన సినిమా విడుదల, ప్రదర్శనకు బ్రేక్ పడింది. అమితాబ్ఇ నటించిన ఝుండ్ సినిమా మూవీ ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్ఫామ్లపైనా స్ట్రీమ్ కాకపోవచ్చు. సుమారు ఏడాదికాలంగా కాపీరైట్ వివాదంలో నడుస్తోన్న ఆ సినిమా విడుదలకు న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కూకట్పల్లి న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. విదేశాల్లో కూడా ఆ సినిమా స్ట్రీమింగ్ను నిలిపివేయాలని పేర్కొంది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో చేసిన ఝుండ్ సినిమాలో ఆయన ఫుట్బాల్ కోచ్గా నటించారు. స్లమ్ సాకర్ ఛాంపియన్ అఖిలేశ్ పాల్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ ఉంటుంది. సైరత్తో మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీలో చెరిగిపోని రికార్డును నెలకొల్పిన నాగరాజ్ పోపట్రావ్ మన్జులే ఈ మూవీ దర్శకుడు. సైరత్.. వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేసిన తొలి మరాఠీ మూవీ. ఆయన దర్శకత్వం వహించిన ఝుండ్ మూవీ విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. కాపీరైట్స్ విషయంలో వివాదాలు ముసురుకున్నాయి. Read More: ఝుండ్ సినిమా కాపీరైట్స్ తన దగ్గర ఉన్నాయని మియాపూర్కు చెందిన ఫిల్మ్మేకర్ డాక్టర్ నంది చిన్నికుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కాపీరైట్స్ తన వద్ద ఉన్నాయంటూ పిటీషన్ దాఖలు చేశారు. దీంతో కూకట్పల్లి న్యాయస్థానం దీనిపై విచారణకు స్వీకరించింది. నిర్మాత, దర్శకుడు నాగరాజ్, టీ సిరీస్ ఛైర్మన్ భూషణ్ కుమార్, లీడ్ రోల్లో నటించిన అమితాబ్ బచ్చన్లకు ఇదివరకే నోటీసులను జారీ చేసింది. ఏడాదికాలంగా కొనసాగుతున్న ఈ కేసు విచారనలో తాజాగా కూకట్పల్లి న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35SYJoc
No comments:
Post a Comment