Thursday 3 September 2020

సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారం.. హీరోయిన్ సంజన గల్రానీ ఆవేదన

వ్యవహారంతో సినీ ఇండస్ట్రీకి ఉన్న లింక్స్ ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉండటం చూస్తున్నాం. గతంలో పెను సంచలనంగా మారి నీరుగారిపోయిన డ్రగ్స్ వ్యవహారం.. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత మరోసారి తెరపైకి వచ్చింది. బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియన్ నటులపై కూడా డ్రగ్స్ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్, క‌న్న‌డ న‌టి రాగిణి ద్వివేదికి సెంట్ర‌ల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేయడం, డ్రగ్స్ రాకెట్ కేసులో హీరోయిన్ గాల్రానీ పేరు బయటకు రావడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. సినీ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరుగుతోందని, డ్రగ్స్ లేని పార్టీలు లేవంటూ వస్తున్న ఆరోపణలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు మెల్లగా కూపీ లాగుతున్నారు. ఇందులో భాగంగా హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్ రాహుల్‌‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. రాహుల్‌తో పాటు ఈ వ్యవహారంలో సంజన పాత్ర ఏ మేర ఉందనే దానిపై ఫోకస్ పెట్టి విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో సంజనకు సమన్లు జారీ చేశారని సమాచారం. అయితే తాజాగా దీనిపై స్పందిస్తూ ఆవేదన చెందింది సంజన. Also Read: మీడియా ప్రతినిధులు పదేపదే కాల్స్ చేస్తూ డ్రగ్స్ రాకెట్ వ్యవహారంపై ప్రశ్నల దాడి కురిపిస్తున్నారని, అందుకే తాను మీడియాకు దూరంగా ఉంటున్నా తప్పితే భయంతో కాదని పేర్కొంటూ ఓ ప్రకటన రిలీజ్ చేసింది సంజన. ఈ వ్యవహారంలోకి తనను అన్యాయంగా లాగుతున్నారని పేర్కొంటూ ఆమె ఆవేదన చెందింది. చూస్తుంటే మరోసారి డ్రగ్స్ ఇష్యూ పలువురు సినీ ప్రముఖులను ఇరకాటంలో పడేస్తుందేమో అనిపిస్తోంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో ఎన్‌సీబి (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో)‌ ఇంకెన్ని నిజాలు బయటకు తీసుకొస్తుందనేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bq8QBk

No comments:

Post a Comment

'Rekha And I Didn't Speak To Each Other For 20 Years'

'Rekha and my wife were close friends, and my so-called cold war with Rekha was causing difficulties in my wife's friendship with he...