Tuesday, 15 September 2020

కోహ్లీ నిన్ను తల్లిని మాత్రమే చేశాడు.. అనుష్క బేబీ బంప్‌పై నెగెటివ్ కామెంట్స్.. డైరెక్టర్ మారుతి ఫైర్

సోషల్ మీడియా అన్నాక నెగెటివ్ కామెంట్స్ కామన్. సెలబ్రెటీలు పెట్టిన పోస్టులపై వ్యంగ్యాస్త్రాలు సంధించేవాళ్ళు ఆన్‌లైన్ వేదికలపై నిత్యం తారసపడుతూనే ఉంటారు. అయితే కొన్ని విషయాలపై నెటిజన్స్ నెగెటివ్ రియాక్షన్స్ ఇచ్చినా పెద్దగా పట్టించుకోని సెలబ్రిటీలు.. వ్యక్తిగత విషయాల జోలికొస్తే మాత్రం ఆ కామెంట్స్ చేసిన వారిని ఏకిపారేస్తుండటం చూస్తున్నాం. తాజాగా బాలీవుడ్ బ్యూటీ విషయంలో ఇలాగే వ్యంగ్యంగా కామెంట్స్ చేసిన ఓ వ్యక్తిపై విరుచుకుపడ్డారు టాలీవుడ్ . అంతకుముందు తాము తల్లిదండ్రులం కాబోతున్న విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన విరుష్క జోడీ తమ తమ అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుకుంది. కాకపోతే రీసెంట్‌గా తన గర్భాన్ని చూసి మురిసిపోతూ అనుష్క శర్మ పెట్టిన పోస్ట్‌పై ఓ మహిళా జర్నలిస్ట్ వ్యగ్యంగా కామెంట్ చేయడం షాక్‌కి గురిచేసింది. మాతృత్వ గొప్పతనాన్ని తెలుపుతూ ''ఈ ప్రపంచంలో ఇంతకంటే మధురమైంది మరొకటి లేదు'' అని అనుష్క చేసిన ఎమోషనల్ కామెంట్‌పై సెటైర్ వేసింది మహిళా జర్నలిస్ట్. Also Read: అనుష్క గారు మిమ్మల్ని విరాట్ కోహ్లీ తల్లిని మాత్రమే చేశారు.. ఇంగ్లాండ్‌కి మహారాణిని చేయలేదు. మరీ అంతలా సంబరపడాల్సిన అవసరం లేదండీ అంటూ ఆ మహిళా జర్నలిస్ట్ కామెంట్ చేయడంతో దాన్ని చూసి కోపంతో ఊగిపోయారు డైరెక్టర్ మారుతి. ''ఒక రాజ్యానికి రాణి కావడం కంటే బిడ్డకు తల్లి కావడమే మహిళకు గొప్ప విషయం. అవును ప్రతి మహిళ ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లు కూడా గొప్ప సామ్రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంది. ఒక మహిళ జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం బాధగా అనిపిస్తోంది'' అంటూ చురకలంటిచారు మారుతి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RqOlLZ

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....