Thursday, 10 September 2020

ఎస్పీ బాలు హెల్త్ అప్‌డేట్.. వందంతులు నమ్మకండి.. ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు: చరణ్

ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ అప్‌డేట్స్‌ ఇస్తున్న ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ తాజాగా మరో అప్‌డేట్ ఇచ్చారు. నాన్న ఆరోగ్యం నెమ్మదిగా మెరుగవుతోందని, ప్రస్తుతం ఎలాంటి ఇన్షెక్షన్లు లేవని అన్నారు. ఇంకా ఎక్మో, వెంటిలేటర్‌ చికిత్స పైనే చికిత్స కొనసాగిస్తున్నారని తెలిపారు. అయితే ఆయన సృహలోనే ఉన్నారని చెప్పారు. ఆయన తప్పకుండా కోలుకొంటారు కానీ దానికి ఎంత సమయం పట్టొచ్చనేది ఖచ్చితంగా చెప్పలేమని అన్నారు. రోజూ ఆయన్ను కలుస్తున్నానని, ఆరోగ్యం నిలకడగా ఉందని చరణ్ పేర్కొన్నారు. ఇకపోతే ఎస్పీ బాలు హెల్త్ అప్‌డేట్స్‌పై వివిధ మాధ్యమాల్లో వస్తున్న రకరకాల వార్తలు తన దృష్టికి వచ్చాయని, వాటిని నమ్మొద్దని చరణ్ తెలిపారు. ఎప్పటికప్పుడు తన తండ్రి ఆరోగ్యం పట్ల తానే సమాచారం అందిస్తానని పేర్కొన్నారు. బాలసుబ్రహ్మణ్యం పూర్తిగా కోలుకొని హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జి అవుతున్నారని, అలాగే ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతినడంతో లంగ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేస్తున్నారని ఇలా పలు వందతులు ప్రచారం చేస్తున్నారని.. ఇవన్నీ వాళ్లకి ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు గానీ అలాంటివేవీ నమ్మొద్దని చరణ్ తెలిపారు. Also Read: తన అభిమానుల కోసం ఐసీయూ నుంచే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు పడుతున్నారనే వార్తల్లో కూడా నిజం లేదని చరణ్ చెప్పుకొచ్చారు. తన నుంచి గానీ, ఆసుపత్రి వర్గాల నుంచి గానీ అప్‌డేట్స్‌ను మాత్రమే ఫాలోకండి అంటూ అభిమానులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవ్వడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ హాస్పిటల్‌లో చేరి చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆయనకు కరోనా నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చినట్లు చరణ్ పేర్కొన్న సంగతి తెలిసిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k6TbKx

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....