మరో మూడు రోజుల్లో బుల్లితెరపై బిగ్ బాస్ సందడి షురూ కాబోతుంది. సెప్టెంబర్ 6 సాయంత్రం 6 గంటలనుంచి స్టార్ మాలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభం కానుంది. ఒకవైపు కరోనా.. మరోవైపు కంటెస్టెంట్స్ ఎంపిక నిర్వాహకులకు తలకు మించిన భారం కావడంతో ఎప్పుడో జూన్-జూలైలలో ప్రారంభం కావాల్సిన షో సెప్టెంబర్ వరకూ వాయిదా పడింది. ఇక ఈ సీజన్కి నాగార్జున రెండో సారి హోస్ట్ బాధ్యతలు తీసుకోగా.. కంటెస్టెంట్స్ లిస్ట్లో చాలా మందే ఉన్నారు. అయితే ఫైనల్ లిస్ట్లో ఎవరు ఉంటారు? బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించే కంటెస్టెంట్స్ ఎవరన్నది మాత్రం సస్పెన్స్గానే మారింది. టీవీ 9 యాంకర్ దేవి, హెఎమ్ టీవీ యాంకర్ సుజాతలు తప్పితే మిగిలిన కంటస్టెంట్స్ లిస్ట్లో ఉన్నవాళ్లు బిగ్ బాస్ హౌస్ వరకూ వెళ్తారా? లేదా? అన్నది చాలా సీక్రెట్గానే ఉంచారు నిర్వాహకులు. ఈ తరుణంలో కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, ప్రణవి, యాంకర్ ఝాన్సీ, శ్రద్ధాదాస్, విష్ణు ప్రియ, తరుణ్లు ఇప్పటికే తాము బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఇక ప్రముఖ సింగర్ సునీత పేరు కూడా సీజన్ 4 కంటెస్టెంట్స్ లిస్ట్లో ఎక్కువగా వినిపించడంతో నేను వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది సునీత. ‘డియర్ ఫ్రెండ్స్.. నేను బిగ్ బాస్ షోకి వెళ్లడం లేదంటూ’ తన ఫేస్ బుక్ ద్వారా అధికారికంగా తెలియజేసింది సింగర్ సునీత. అయితే చాలామంది ఆమె పోస్ట్పై స్పందిస్తూ మంచి పని చేశారు మేడమ్ అంటూ బిగ్ బాస్ షోని తిట్టిపోస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3bl6Ryp
No comments:
Post a Comment