నగరంలో కరోనా వైరస్ కేసు బయటపడడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. బయటి ప్రదేశాల నుంచి ఎవరు వచ్చినా వారికి వైద్య పరీక్షలు నిర్వహించాకే పంపిస్తున్నారు. ఈనేపథ్యంలో ప్రముఖ నటి (అన్నమయ్య ఫేం) పని నిమిత్తం కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ వచ్చారట. అయితే ఇక్కడి నుంచి ఆమె తిరిగి తన స్వస్థలమైన చెన్నై వెళ్లిపోవాల్సి ఉంది. కానీ కరోనా కేసులు తెలంగాణలో ఎక్కువ అవుతుండడంతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ మేరకు తన బాధను ట్విటర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి ఆమె ఓ ట్వీట్ చేసారు. ‘తెలంగాణలో కరోనా పేషెంట్ ఉన్నారా? నేను ఇక హైదరాబాద్లోనే చిక్కుకుపోవాల్సిందేనా? ఎందుకంటే నాకు ఎయిర్పోర్ట్కి వెళ్లాలంటే భయంగా ఉంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు. మరి కస్తూరి ఈరోజైనా చెన్నై చేరుకున్నారో లేదో తెలియాల్సి ఉంది. హైదరాబాద్లో కరోనా వైరస్ కేసు గుర్తించిన నేపథ్యంలో తాజాగా మంగళవారం మరో ముగ్గురు వ్యాధి లక్షణాలతో గాంధీ ఆస్పత్రిలో చేరారు. వైద్య సిబ్బంది వీరిని ప్రత్యేక అంబులెన్స్లో ఆస్పత్రికి తీసుకొచ్చారు. వెంటనే వీరికి ప్రత్యేక ఐసోలేషన్ వార్డుకు తరలించిన వైద్యులు.. ఈ ముగ్గురుకీ రక్త పరీక్షలు నిర్వహించాల్సి ఉందని చెప్పారు. READ ALSO: వీరి కరోనా పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ ఏమీ చెప్పలేమని వైద్యులు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కరోనా వైరస్ బారిన పడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి చేసిన 9 టెస్టులతో పాటు మంగళవారం వచ్చిన 13 కలిపి మొత్తం 22 మంది రిపోర్ట్స్ వెయిటింగ్లో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. చైనాలోని వుహాన్లో మొదలైన ఈ మహమ్మారి వైరస్ పక్క దేశాలతో పాటు మన భారతదేశంలోకి కూడా వ్యాపించేయడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39mZuVk
No comments:
Post a Comment