యంగ్ టైగర్ నుంచి మరో సినిమా రావాలంటే ఫ్యాన్స్ 2021 వరకు ఎదురుచూడల్సిందే. ఎందుకంటే ప్రస్తుతం తారక్ ‘’ సినిమాతో బిజీగా ఉన్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జులై 30న సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన జక్కన్న 2021 జనవరి 8కి వాయిదా వేసి పెద్ద షాక్ ఇచ్చారు. దాంతో ఫ్యాన్స్ బాగా హర్ట్ అయ్యారు. అయితే ఏప్రిల్లోగా ఈ సినిమాలో తారక్ సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ అయిపోతుందని తెలుస్తోంది. ఆ తర్వాత తారక్ తన తదుపరి సినిమా షూటింగ్ మొదలుపెట్టొచ్చు. అయితే ‘RRR’ తర్వాత తారక్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో కలిసి పనిచేస్తారని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘అయిననూ హస్తినకు పోయి రావలె’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. ఈ విషయం పక్కనబెడితే.. ఎన్టీఆర్ తదుపరి సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్లో జరుగుతోంది. అదేంటంటే.. తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్తో కలిసి ఎన్టీఆర్ పనిచేయబోతున్నారట. తమిళంలో ‘ఆడుకాలం’, ‘వడా చెన్నై’, ‘అసురన్’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన వెట్రిమారన్.. ఈ సారి తెలుగులో ఓ సినిమా చేయాలని అనుకుంటున్నారట. READ ALSO: అది కూడా ఎన్టీఆర్తోనే సినిమా తీయాలన్నది ఆయన కోరికట. అందుకోసం ఇటీవల తారక్ను కలిసి మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. అదీకాకుండా ‘RRR’ తర్వాత తారక్ కూడా రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ఏదన్నా కొత్తగా ప్రయత్నించాలని అనుకుంటున్నారట. వెట్రిమారన్ కెపాసిటీ గురించి తారక్కు కూడా తెలుసు కాబట్టి ఆయనతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ‘RRR’ సినిమా షూటింగ్ అయిపోగానే తన తర్వాతి ప్రాజెక్ట్స్ మొదలుపెడతాడా? లేక ‘RRR’ చేస్తూనే వేరే సినిమాలు కూడా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. READ ALSO:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UF5156
No comments:
Post a Comment