Monday 10 February 2020

నన్ను పలకరించేది తనొక్కడే, వాడే చనిపోయాడు: కన్నీరుపెట్టుకున్న షకీలా

ప్రముఖ నటి , కమెడియన్ వేణు మాధవ్ కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. షకీలాపై జనాల్లో తప్పుడు అభిప్రాయాలు ఉన్నప్పటికీ.. వేణు మాధవ్ మాత్రం ఆమెను సోదరిగా భావించేవారు. కానీ ఇప్పుడు వాడు లేడు అంటూ కన్నీరుపెట్టుకున్నారు షకీలా. ఆమె ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా షకీలా.. వేణు మాధవ్ గురించి మాట్లాడారు. ‘‘నా జీవితంలో ఆల్‌టైం గుడ్‌ఫ్రెండ్స్ అనేవారు ఎవ్వరూ లేరు. నేను చాలా మందితో కలిసి పనిచేసాను. అయినా కూడా నాకు ఎవ్వరూ ఫ్రెండ్స్ అవ్వలేదు. వారి నెంబర్లు కూడా నేను తీసుకోలేదు. నాకేం అవసరం. వారి నెంబర్లు తీసుకుని నేనేం చేసుకోవాలి. ఒకవేళ ఫోన్ చేస్తే సినిమా అవకాశం కోసం చేసినట్లుంది అనుకుంటారు. నాకు అలాంటి అవసరం లేదు. ఇండస్ట్రీలో నేను ముగ్గురితోనే క్లోజ్‌గా కాస్త క్లోజ్‌గా ఉంటారు. వారిలో ఆలీ అన్న ఒకరు. ఆయనంటే నాకు గౌరవం. ఎప్పుడైనా సినిమాల కోసం ఫోన్ చేసి మాట్లాడుతుంటాను. రెండోది గీతాంజలి అని ఓ నటి ఉంది" READ ALSO: "తనతో కూడా బాగానే మాట్లాడతాను. ఇక మూడోది వేణు మాధవ్. నా తమ్ముడు లాంటివాడు. అక్కా తిన్నావా అని ఫోన్ చేసి అడిగే ఎకైక వ్యక్తి వాడే. ఇప్పుడు వాడే లేడు. నన్ను చూసి చాలా మంది బోల్డ్ అంటూ ఉంటారు. కానీ నేను చిన్నపిల్లలా చాలా సెన్సిటివ్. వేణు మాధవ్ పేరు ఎత్తగానే ఏడుపొచ్చేసింది. వాడే బతికి లేనప్పుడు ఇక నేను వాడి కుటుంబంతో ఎలా మాట్లాడతాను. ఇక దర్శకుల్లో నేను గౌరవించే ఏకైక వ్యక్తి కోడి రామకృష్ణ గారు. కానీ ఆయన కూడా లేకపోవడం బాధాకరం’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు షకీలా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39pGOUo

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...