Friday, 17 January 2020

బన్నీ తొలిసారి.. త్రివిక్రమ్‌ నాలుగోసారి.. కలిసొచ్చిన సెంటిమెంట్‌

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం . సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకు పోతోంది. లాంగ్‌ గ్యాప్‌ తరువాత బన్నీ తెర మీద కనిపించటంతో ఫ్యాన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ఇప్పటికే చాలా ఏరియాల్లో నాన్‌ బాహుబలి రికార్డ్‌లను కొల్లగొట్టిన అల వైకుంఠపురములో తాజాగా మరో అరుదైన రికార్డ్‌ను సాధించింది. ఈ సినిమాతో తొలిసారిగా యూఎస్‌లో 2 మిలియన్‌ క్లబ్‌లో చేరాడు. అయితే త్రివిక్రమ్‌ ఈ ఘనత సాధించటం ఇది నాలుగోసారి. గతంలో అజ్ఞాతవాసి, అ ఆ, అరవింద సమేత, సినిమాలతో 2 మిలియన్ల క్లబ్‌లో చేరిన త్రివిక్రమ్‌ ఇప్పుడు నాలుగోసారి అదే రికార్డ్‌ను అందుకున్నాడు. యూఎస్‌ 2 మిలియన్‌ సాధించిన నాలుగు చిత్రాలు ఉన్న ఏకైక దర్శకుడు త్రివిక్రమే కావటం విశేషం. Also Read: త్రివిక్రమ్‌ చాలా కాలంగా తన సినిమాలకు అ అనే అక్షరంతో టైటిల్‌ వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడు. ఆ `అ` సెంటిమెంటే త్రివిక్రమ్‌కు కలిసొచ్చిందంటున్నారు ఫ్యాన్స్‌. ఈ సినిమాతో మరోసారి 2 మిలియన్‌ క్లబ్‌లో చేరిన మాటల మాంత్రికుడు ఓవర్‌సీస్‌లో తన పట్టును మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో టబు, జయరామ్‌, సుశాంత్‌, నివేదా పేతురాజ్‌, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సీజన్‌లో రిలీజ్‌ కావటంతో వసూళ్లు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రికార్డ్‌ వసూళ్లు సాధిస్తున్న అల వైకుంఠపురములో, ఫుల్‌ రన్‌లో బన్నీల కెరీర్‌లో హైయ్యస్ట్ గ్రాసర్‌గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3amu2ra

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....