Sunday, 19 January 2020

ఫ్యాన్స్ కల నెరవేరింది.. బాలీవుడ్‌లో అడుగుపెట్టేసిన విజయ్ దేవరకొండ

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకు టాలీవుడ్‌లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడనే కాదు బాలీవుడ్‌లోనూ ఈ కుర్ర హీరోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. విజయ్ ముంబయిలో ఎప్పుడు అడుగుపెట్టినా అక్కడి ఫొటోగ్రాఫర్లు, ఫ్యాన్స్ వెలకం భాయ్ అంటూ స్వాగతిస్తుంటారు. అయితే బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి ఆ వార్తలు ఈరోజు నిజమయ్యాయి. తమ అభిమాన నటుడ్ని జాతీయ స్థాయి స్టార్‌గా చూడాలని కలలు కన్న ఫ్యాన్స్ కల నెరవేరింది. విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాకు పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్‌తో చేతులు కలపడానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళంలోనే కాకుండా హిందీలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు నుంచి ముంబయిలో షూటింగ్ ప్రారంభం అయింది. READ ALSO: సినిమాకు ఛార్మీ క్లాప్ కొట్టారు. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ థాయ్‌ల్యాండ్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. సినిమాలో రమ్యకృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘జై లవకుశ’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన రోనిత్ రాయ్ కూడా ఇందులో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ ఎవరన్నది ఇంకా తెలియాల్సి ఉంది. చాలా కాలంగా జాన్వి కపూర్ పేరు వినిపిస్తోంది. సినిమా కోసం పూరీ జగన్నాథ్ జాన్విని తీసుకోవాలని ఆమె తండ్రి బోనీ కపూర్‌తో మాట్లాడారని వార్తలు వెలువడుతున్నాయి. మొత్తానికి విజయ్ దేవరకొండ బాలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/369o0qr

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....