Wednesday, 22 January 2020

ప్రభాస్, కృష్ణం రాజు సినిమా.. అయ్యో ఆగిపోయిందే

యంగ్ రెబెల్ స్టార్ ఎందరితో సినిమాలు చేసినా.. తన పెదనాన్న కృష్ణం రాజు డైరెక్షన్‌లో నటిస్తే చూడాలని ఎందరో ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. వారి కోరికను కృష్ణం రాజు కూడా నెరవేర్చాలని అనుకున్నారు. కానీ మనం ఒకటి తలిస్తే పైవాడు మరొకటి తలుస్తాడు అన్నట్లు ఆ సినిమాను ఆపేయాల్సి వచ్చింది. ఈ సినిమాకు అదిరిపోయే టైటిల్‌ను కూడా కృష్ణం రాజు రెడీ చేసి పెట్టుకున్నారు. సినిమాకు ‘ఒక్క అడుగు’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నారట. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఛత్రపతి’ సినిమాలోని ‘ఒక్క అడుగు’ అని డార్లింగ్ చెప్పే డైలాగ్ బాగా హైలైట్ అయింది. దానినే టైటిల్‌గా పెట్టాలనుకున్నారు కృష్ణం రాజు. అయితే కృష్ణం రాజు ప్రభాస్‌తో సినిమా తీయాలని నిర్ణయించుకున్నప్పుడు.. ‘సాహో’ సినిమా అడ్డొచ్చింది. దాంతో ప్రభాస్ తన డేట్లను సుజీత్‌కు ఇచ్చేశారు. ఆ తర్వాతైనా సినిమా తీద్దామని అనుకున్నారు కానీ ప్రభాస్ రాధాకృష్ణతో ‘జాన్’ సినిమాకు ఫిక్స్ అయ్యారు. దాంతో ఇక సినిమా తీసే ఆలోచనలను మానుకున్నారు కృష్ణం రాజు. ఈ విషయాన్ని ఆయనే ఓ సందర్భంలో వెల్లడించారు. READ ALSO: ఇప్పుడు తనకు వయసు అయిపోయిందని, డైరెక్ట్ చేసే ఓపిక లేదని తెలిపారు. ప్చ్.. అలా ఓ చక్కటి కాంబినేషన్‌లో తెరకెక్కాల్సిన సినిమా ఆగిపోయింది. అయితే ఇదే టైటిల్‌తో ప్రభాస్ మరో డైరెక్టర్‌తో కలిసి సినిమా చేసే ఛాన్స్ ఉంది. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ ‘జాన్’ (వర్కింగ్ టైటిల్)తో బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది. ఆ తర్వాత ఆస్ట్రియాలో షూటింగ్ అవుతుంది. ఇందులో పూజా హెగ్డే కథనాయికగా నటిస్తున్నారు. READ ALSO:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RkzK5k

No comments:

Post a Comment

FM: 'Focus Of Budget Was To Keep Stable Growth Going'

'We kept this Budget on a larger plank, rather than on one incident, however serious.' from rediff Top Interviews https://ift.tt/F...