‘రణరంగం’ ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్న యంగ్ హీరో శర్వానంద్కు ఊహించిన వ్యక్తి కళ్ల ముందు దర్శనమిచ్చారు. ఆయనెవరో కాదు పవర్ స్టార్ . వెంటనే తన స్మార్ట్ఫోన్ తీసిన శర్వానంద్.. పవన్తో సెల్ఫీ దిగారు. దీన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘‘రణరంగం ట్రైలర్ లాంచ్ కోసం కాకినాడ వెళ్తుండగా అదృష్ణవశాత్తు మన పవర్ స్టార్ను కలిశా’’ అని శర్వా ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. కాగా, పవన్ కళ్యాణ్ ఆదివారం భీమవరం వెళ్లారు. క్యాన్సర్తో చనిపోయిన తన అభిమాని మురళి కుటుంబాన్ని పరామర్శించడానికి పవన్ భీమవరం వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి వెళ్లిన పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం వెళ్లారు. అయితే, రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ దిగిన సమయంలో శర్వానంద్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పవన్ను శర్వా కలిశారు. విమానాశ్రయం షటిల్ బస్సులో పవన్తో శర్వా సెల్ఫీ దిగారు. ఇదిలా ఉంటే, ఆదివారం సాయంత్రం కాకినాడలో జరగనున్న ‘రణరంగం’ ట్రైలర్ లాంచ్ వేడుకకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రశాంత్ పిళ్లై సంగీతం సమకూర్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2OE6zep
No comments:
Post a Comment