Sunday, 4 August 2019

ఆయనేమైనా ఎంపీనా, నేను ఎమ్మెల్యేనా.. పోసాని వ్యాఖ్యలపై పృథ్వీ

తన ఆరోగ్యంపై వచ్చిన పుకార్లను ఖండించేందుకు ఇటీవల మీడియా ముందుకు వచ్చిన నటుడు, రచయిత .. మరో నటుడు, ప్రస్తుత ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు. ఎస్వీబీసీలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడేందుకు ఆదివారం హైదరాబాద్‌లోని ప్రెస్ క్లబ్‌లో పృథ్వీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జర్నలిస్టులు పోసాని వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు. దీనికి స్పందించిన పృథ్వీ.. ‘‘గతంలో పోసానిగారు ఏమైనా ఎంపీనా, నేను ఎమ్మెల్యేనా నా మీద వ్యాఖ్యలు చేయడానికి?’’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. తనకన్నా ఒక సంవత్సరం, ఆర్నెళ్లు అటుఇటుగా పోసాని ఇండస్ట్రీలో ముందున్నారని పృథ్వీ అన్నారు. ‘‘నా కన్నా పోసాని బాగా చదువుకున్నారు. నేను ఎంఏ చదివితే.. ఆయన డబుల్ ఎంఏ, పీహెచ్‌డీ కూడా చేశారు. ఒకవేళ నేనేమైనా తప్పుగా మాట్లాడితే మా అన్నయ్య నన్ను కరెక్ట్ చేశాడు. దానిలో తప్పేముంది? మేమంతా ఒక కుటుంబం. దీన్ని తీసుకెళ్లి పోసాని, పృథ్వీకి వైరం అంటూ రాస్తారు. కుటుంబంలో మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి వైషమ్యాలు లేవు. ఆయన నాలానే సహృదయుడు, నా అన్న, మంచివాడు. ఆయన ఒక టైగర్ లాంటి వ్యక్తి’’ అంటూ పృథ్వీ వివరణ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామికి ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఎక్కడా అవినీతికి తావులేకుండా తాను ఎస్వీబీసీకి సేవలు అందిస్తానని పృథ్వీ స్పష్టం చేశారు. గతంలో ఎస్వీబీసీలో జరిగిన అవకతవకలను బయటికి తీస్తామని, వాటిపై పూర్తి విచారణ జరిపి నివేదికను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేస్తామని పృథ్వీ చెప్పారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తాను ఎస్వీబీసీ కార్యాలయంలోనే ఉంటున్నానని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎస్వీబీసీ కార్యాలయ పర్యవేక్షణ నిమిత్తం తాను వచ్చానని వెల్లడించారు. కాగా, ఇటీవల పోసాని నిర్వహించిన మీడియా సమావేశంలో సినీ పరిశ్రమకు చెందిన కొంత మందికి ఏపీ ప్రభుత్వం నామినేటెడ్ పదువులు ఇవ్వడంపై స్పందించారు. జగన్ తనను పిలిచి ఏదైనా పదవి ఇస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నానని, తనకు ఇగో ఫీలింగ్స్ ఏమీ లేవని స్పష్టం చేశారు. కానీ, పదవి కావాలని తానే స్వయంగా వెళ్లి అడుక్కోనని కాస్త గట్టిగానే మాట్లాడారు. అంతేకాకుండా, ఎస్వీబీసీ చైర్మన్‌గా నియమితులైన నటుడు పృథ్వీ గురించి పరోక్షంగా మాట్లాడుతూ తనకంటే జూనియర్లకు పదవులిచ్చినా తనకు ఎలాంటి కోపం లేదన్నారు. అలాగే, జగన్ సీఎం కావడం సినీ పరిశ్రమలో చాలా మందికి ఇష్టంలేదంటూ గతంలో పృథ్వీ చేసిన కొన్ని వ్యాఖ్యలను పోసాని తప్పుబట్టారు. వీటి గురించే తాజాగా జర్నలిస్టులు పృథ్వీని ప్రశ్నించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Ks2xAc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....