Monday, 10 July 2023

Thaman - సయధరమ తజ కననళల పటటకననడ: థమన

‘బ్రో’ సినిమాలో కొన్ని సన్నివేశాలు చూసి సాయిధరమ్ తేజ్ కన్నీళ్లు పెట్టుకున్నారని సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ అన్నారు. బయట పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ మధ్య ఎంత మంచి అనుంబంధం ఉంటుందో.. అది తెర మీద మనకు కనిపిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో పి. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వివేక్ కూచిబొట్ల సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ఇతర ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ‘మై డియర్ మార్కండేయ’ పాట విడుదలై మెప్పించింది. ఈ నేపథ్యంలో మీడియాతో థమన్ ముచ్చటించారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/bTcIpFs

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...