తెలంగాణ రాష్ట్రం లోని `ఓదెల`అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందుతోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’. సహజత్వానికి దగ్గరైన సన్నివేశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాధ అనే పల్లెటూరి అమ్మాయిగా హీరోయిన్ నటిస్తోంది. గతంలో ఎన్నడూ కనిపించని విధంగా వైవిద్యమైన పాత్రతో అలరించేందుకు రెడీ అయింది ఈ ముద్దుగుమ్మ. దీపావళి కానుకగా హెబ్బా లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. డీ గ్లామర్గా కనిపిస్తున్న హెబ్బా పటేల్ లుక్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడమే గాక సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత కె.కె.రాధామోహన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథ, స్క్రీన్ప్లే, మాటలు అందిస్తున్నారు. కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోగా పేరు తెచ్చుకున్న వశిష్ట సింహ తెలుగులో మొదటిసారి ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. Also Read: ఈ 'ఓదెల రైల్వేస్టేషన్' మూవీలో సున్నితమైన మనసు, దృడమైన వ్యక్తిత్వం గల పల్లెటూరి అమ్మాయిగా హెబ్బా పటేల్ కనిపించనుందని, దీపావళి కానుకగా ఆమె లుక్ విడుదల చేయడం సంతోషంగా ఉందని నిర్మాత కె.కె.రాధామోహన్ అన్నారు. ఈ మూవీ ఫుల్ రియలెస్టిక్ అప్రోచ్తో ఉండబోతుందని, పూర్తి న్యాచురాలిటీతో దర్శకుడు అశోక్ తేజ ఈ చిత్రాన్నితెరకెక్కిస్తున్నారని తెలిపారు. ఓదెల రైల్వే స్టేషన్, ఓదెల మండల పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్స్తో పాటు హైదరాబాద్లో షూటింగ్ పూర్తి చేశామని, అతి త్వరలో ఈ మూవీ విడుదల చేస్తామని చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38V9pEn
No comments:
Post a Comment