Tuesday, 3 March 2020

O Pitta Katha: ఆల్ ది బెస్ట్ డార్లింగ్.. ‘ఓ పిట్ట కథ’పై ప్రభాస్ పోస్ట్ వైరల్

సీనియర్ నటుడు బ్రహ్మాజీ ఇండస్ట్రీలో తనకు ఉన్న పరిచయాలతో ‘’ చిత్రానికి మంచి హైప్ తీసుకువస్తున్నారు. బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావ్ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న ఈ మూవీ మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం నాడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరై.. అదే వేదికపై కొరటాల దర్శకత్వంలో చేస్తున్న 152 మూవీ టైటిల్‌ను అనౌన్స్ చేయడంతో ‘ఓ పిట్ట కథ’ చిత్రానికి ఒక్కసారిగా హైప్ వచ్చేసింది. ఇక బ్రహ్మాజీతో మంచి అనుబంధం ఉన్న రెబల్ స్టార్ ‘ఓ పిట్టకథ’ చిత్రానికి బెస్ట్ విషెష్ అందిస్తూ ఫేస్ బుక్ పోస్ట్ పెట్టారు. ‘ఓ పిట్టకథ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంజయ్‌కి బెస్ట్ విషెష్.. అలాగే మై డార్లింగ్ బ్రహ్మాజీకి, భవ్యా క్రియేషన్స్‌కి టోటల్ టీంకి ఆల్ ది బెస్ట్’ అంటూ ప్రభాస్ ఫేస్ బుక్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. మొత్తానికి మొన్నటి ప్రీ రిలీజ్ వేడుకలో మెగా ఫ్యాన్స్ మనసుదోచుకున్న ఓ పిట్టకథ.. నేడు ప్రభాస్ ట్వీట్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో ఆసక్తిరేకెస్తోంది. చిన్న చిత్రంగా మొదలైన ఈ చిత్రానికి స్టార్ మద్దతు లభించడంతో వచ్చే శుక్రవారం విడుదలయ్యే చిత్రాల్లో ‘ఓ పిట్టకథ’కు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. చెందు ముద్దు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ బ్యానర్‌పై వి. ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించారు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతాన్ని అందించాడు. మార్చి 6న ఈ సినిమాను భారీగా విడుదల చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3cw5KMf

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....