Wednesday, 25 March 2020

Chiranjeevi ‘ఆచార్య’కి ఘనస్వాగతం చెప్పిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు-మెగాస్టార్ ఈ ఇద్దరూ కలిసి కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్నారనే వార్త అఫీషియల్ ప్రకటన కావాల్సి ఉండగా.. చిరుకి వెళ్కమ్ చెప్తూ ట్వీట్ వదిలారు సూపర్ స్టార్ . శార్వరి నామ సంవత్సర ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా.. అందరికీ విషెష్ అందిస్తూ కరోరా మహమ్మారిని కలిసి కట్టుగా జయించడానికి కంకణం కట్టుకుందాం అంటూ పిలుపునిచ్చారు మెగాస్టార్ చిరంజీవి. కాగా మెగాస్టార్ సోషల్ మీడియాలోకి మెగా ఎంట్రీ ఇవ్వడంతో పలువురు సెలబ్రిటీలు స్వాగతం పలుకుతూ ట్వీట్లు చేశారు. రాజమౌళి, నాగార్జున, మోహన్ లాల్, రాధిక, సుహాసిన తదితరులు మెగాస్టార్‌కి స్వాగతం చెప్పగా.. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం మెగాస్టార్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. కాగా కొరటాల కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రామ్ చరణ్, మ్యాట్నీ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్డెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో మహేష్ బాబు లేదా రామ్ చరణ్‌‌లో ఎవరో ఒకరు నటించడం ఖాయం గానే కనిపిస్తుంది. ఎవరన్నది త్వరలో తేలాల్సిఉంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UkkoQ0

No comments:

Post a Comment

RBI Governor: 'Rates may remain low in near to medium term'

"It is quite possible that the rates will remain low in the near to medium term, but that will depend on how conditions evolve," s...